బిగ్ బాస్ 8: ఏంటి ఆ టీమ్ ఇండియా క్రికెటర్ కూడానా..!?

Anilkumar
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే రాబోతోంది. ఇప్పటివరకు సీజన్ సెవెన్ సూపర్ సక్సెస్ అవడంతో సీజన్ 8 ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇందులో భాగంగానే ఇప్పుడు సీజన్ 8 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ లవర్స్. అయితే ఆగస్టు లేదా సెప్టెంబర్ లో ఈ షో ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా గతంలో సీజన్ స్టార్ట్ అవ్వకముందే చాలా మంది కంటెస్టెంట్ పేర్లు బయటికి రావడంతో టీం అందరూ కూడా ఈ సీజన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు వహించినా కూడా కొందరు ఆకతాయిలు మాత్రం కొందరి

 పేర్లను బయట పెట్టేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు కొంతమంది పేర్లు లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి సీజన్ మంచి సక్సెస్ అవ్వాలి అంటే కంటెస్టెంట్ సెలక్షన్ బాగుండాలి. షోలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటేనే ప్రేక్షకులు చూడడానికి ఇష్టపడతారు. అందుకే ఈ విషయంలో బిగ్ బాస్ టీం ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఓ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడుని బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా తీసుకొచ్చేందుకు టీమ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెట్‌కు కంప్లీట్‌గా గుడ్ బై చెప్పిన రాయుడు.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు.

 తొలుత వైసీపీలో చేరి.. పది రోజుల తిరగకుండానే.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. తర్వాత జనసేనలో చేరాడు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించాడు. అయితే రాయుడు ఆటలోనే కాదు బయట కూడా చాలా దూకుడు స్వభావంతో ఉంటాడు. పలుసార్లు ప్లేయర్లతో పాటు అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అంతేకాదు మేనేజ్మెంట్‌పై సైతం తన ఆగ్రహాన్ని బాహాటంగా వెళ్లగక్కాడు. దీంతో రాయుడు ఉంటే.. కంటెంట్‌కు కొరత ఉండదని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో రాయుడు ఉంటే షోకి.. యూనివర్శిల్ అప్పీల్ వస్తుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: