కొత్త సినిమా ప్రకటించిన సమంత.. కానీ ఓపెనింగ్ కి మాత్రం డుమ్మా..!?

Anilkumar
సమంత ఈ మధ్యకాలంలో సినిమాలు చేయడం పూర్తిగా తగ్గించేసింది. తన తన అనారోగ్య సమస్యల కారణంగా ఆచితూచి సినిమాల విషయంలో నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ఆమె ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసిన సమంత సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. అలా సినిమాలు చేయకపోయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె మమ్ముట్టి తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ వార్తలు వచ్చిన సంగతి మనందరికీ

 తెలిసిందే. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సినిమాతో మలయాళం లోకి ఎంట్రీ ఇస్తోంది సమంత. అయితే నిన్న ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు లాంటివి చేశారు. ఇక ఈ సినిమా ప్రారంభోత్సవానికి దర్శకుడు నిర్మాతలతో పాటు పలువురు హాజరయ్యారు. హీరోగా నటిస్తున్న మమ్ముట్టి సైతం వచ్చారు. కానీ సమంత మాత్రం ఎక్కడా కనిపించలేదు. దాంతో సమంత అసలు ఈ సినిమా చేస్తోందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లేదా ఇప్పుడు రాకుండా డైరెక్ట్ గా షూటింగ్ కి వెళదామని ఇప్పుడు డుమ్మా కొట్టిందా అన్న సందేహాలు మొదలయ్యాయ్. ఇదిలవుండగా మరో పక్కరీఎంట్రీ ఏ

 సినిమాతో అనేది ఖరారైంది. సొంత నిర్మాణంలోనే ఆ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇటీవలే ఆమె ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ పేరుతో ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులోనే ఆమె కొత్త చిత్రం 'మా ఇంటి బంగారం' తెరకెక్కనుంది. సమంత పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని పోస్టర్‌తోపాటు పేరు ప్రకటించారు. అందులో గన్‌ చేతపట్టిన గృహిణిగా కనిపిస్తున్నారు సమంత. ''బంగారం అనిపించుకోవాలంటే ప్రతీదీ మెరిసిపోవల్సిన అవసరం లేదు'' అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమాని ప్రకటించారు సమంత. ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: