పుష్ప 2: రిలీజ్ కి ముందే రికార్డ్స్ బ్రేక్..!?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప 2. పుష్ప సినిమా విడుదలై ఎంతటి బ్లాక్ పాస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాంతో దీనికి సీక్వెల్ గా ఇప్పుడు పుష్ప టు తెరకేకిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కాబోతోంది. అయితే ముందుగా ఆగస్టు 15న పుష్ప టు విడుదల చేస్తాము అని అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం. కానీ షూటింగ్ ఆలస్యం కావడం వల్ల డిసెంబర్ కి పోస్ట్ పోన్ చేశారు. అయితే ఈ పోస్ట్ ఫోన్ కి కారణం కూడా డైరెక్టర్ సుకుమార్ అని అంటున్నారు. షూటింగ్ విషయంలో కొంత

 అసంతృప్తిగా ఉన్న సుకుమార్ మళ్లీ కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నట్లుగా అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇకపోతే ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. ఆమెతోపాటు అనసూయ సునీల్ ఫహాద్ ఫజిల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ మరియు ఆడియో హక్కుల కోసం భారీ డీల్ కుదిరినట్లుగా తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కెఇ జ్ఞానవేల్ రాజా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేవలం 'పుష్ప 2' హిందీ వెర్షన్‌ నాన్ థియేట్రికల్ హక్కులే రూ. 260 కోట్ల భారీ రేటు పలికాయని చెప్పారు.

దీని ప్రకారం ఇది ఇండియాలో ఏ భాషలోనైనా హయ్యెస్ట్ నాన్-థియేట్రికల్ డీల్ అని చెప్పాలి. ఇక 'కేజీఎఫ్ 2' కంటే అల్లు అర్జున్ సినిమా ఎక్కువ వసూళ్లు రాబడుతుందని తమిళ నిర్మాత అభిప్రాయపడ్డారు. నార్త్ ఇండియన్ మార్కెట్ లో 'పుష్ప: ది రూల్' మూవీ రికార్డులు బ్రేక్ చేస్తుందని, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుందని ఆయన అన్నారు.  సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ మూవీపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుష్ప రాజ్ లాంటి ఐకానిక్ క్యారక్టర్ ను తెరపై చూడటానికి సినీ ప్రియులు అందరూ ఆతృతగా వేచి చూస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: