తెలంగాణలో భారతీయుడు 2 టికెట్ రేట్లు పెంచేసారుగా.. ఎంతంటే..!?

Anilkumar
లోకనాయకుడు కమలహాసన్ చేస్తున్న లేటెస్ట్ సినిమా భారతీయుడు 2. సుమారు 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వల్ గా ఈ సినిమా రాబోతోంది. అయితే అప్పట్లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంతటి సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా అందులోని పాటలు ఇప్పటికీ చాలా మంది వింటూనే ఉంటారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కమలహాసన్ ఇందులో ద్విపాత్రాభినయం చేయడం అలాగే ఇందులో మనీషా కోయిరాల హీరోయిన్గా నటించిన అంతేకాకుండా కస్తూరి వంటి వారు ఇతర కీలక పాత్రల్లో

 నటించడంతో ఈ సినిమాను ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఎవరు అంత సులువుగా మర్చిపోలేదు. అలాంటిది దాదాపు 28 ఏళ్ల సంవత్సరం తర్వాత భారతీయుడు టు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చిత్ర బృందం త్వరలోనే ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమోషన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.  తాజాగా ఈ సినిమాకి తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లు పెంచుకునే 
 అమ్ముకునే అవకాశం కల్పించింది. మల్టీప్లెక్స్ లో 75 రూపాయలతో పాటు సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు పెంచుకునే అమ్ముకునే అవకాశం

 కల్పించారు. ఈ మధ్యనే రేవంత్ రెడ్డి సినిమా టికెట్ రేట్లు పెంచి అమ్ముకోవాలంటే యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ చేయాలని ఈ మేరకు హీరో హీరోయిన్లతో వీడియోలు రిలీజ్ చేయించాలని కోరారు. అందులో భాగంగా ఈ సినిమాలో నటించిన కమల్ హాసన్, సిద్ధార్థ, సహ సముద్ర ఖని వంటి వాళ్ళు డ్రగ్స్ వినియోగం తప్పంటూ వీడియో రిలీజ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా ప్రభుత్వం 75 రూపాయలు మాక్సిమం 50 రూపాయలు మినిమం పెంచుకుని అమ్ముకునేలా అవకాశం కల్పించింది. అలాగే ఉదయాన్నే మరో షో వేసుకునేందుకు కూడా అవకాశం కల్పించింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: