తనతో విడిపోయి మంచిపని చేశాను.. లేదంటే నా జీవితం ఆమెలాగా అయ్యేదేమో..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే సమంత అక్కినేని నాగచైతన్య ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత రెండు మూడు సంవత్సరాలు కలిసి ఉన్న ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం ఎవరి జీవితంలో వారు బిజీగా ఉన్నారు .వీరిద్దరూ కూడా ప్రస్తుతం వరుస సినిమాల చేస్తున్నారు. అయితే చాలా సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అసలు ఎందుకు విడిపోయారు అన్నదానికి జవాబు మాత్రం ఎవరి దగ్గర లేదు .సమంత విడాకుల తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిన సంగతి కూడా చాలామందికి

 తెలిసే ఉంటుంది. అలా డిప్రెషన్ లోకి వెళ్లడంతో తనకి మయోసైటిస్ అనే వ్యాధి సైతం వచ్చింది. ప్రస్తుతం గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటోంది సమంత. అందులో భాగంగానే సినిమాలకి సైతం బ్రేక్ ఇచ్చింది .అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక  ఆ ఇంటర్వ్యూలో భాగంగా తన మ్యారీడ్ లైఫ్ షాకింగ్ కామెంట్స్ చేసింది. సమంత మాట్లాడుతూ… సావిత్రి జీవితం నాకు పెద్దగా తెలియదు. మహానటి మూవీ షూటింగ్ సమయంలో సావిత్రి కి సంబందించిన చాలా విషయాలు నాకు తెలిసొచ్చాయి. సావిత్రి మాదిరి నేను కూడా ప్రేమలో మోసపోయే దాన్ని.

 కొంచెంలో తప్పుకున్నాను. లేదంటే నా జీవితం మరో సావిత్రిలా అయ్యేది, అన్నారు. సావిత్రి జెమినీ గణేశన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే… ఆయన మరొక మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. అది తెలిసిన సావిత్రి మానసిక క్షోభకు గురైంది. చివరి రోజుల్లో జీవచ్ఛవంలా బ్రతికింది. అతన్ని వదిలించుకోకపోతే నా జీవితం కూడా దుర్బరం అయ్యేదని సమంత అన్నారు. ఈ వ్యాఖ్యలు హీరో సిద్దార్థ్ ని ఉద్దేశించి ఆమె చేశారనే వాదన ఉంది. సమంత-సిద్ధార్థ్ కలిసి జబర్దస్త్ అనే మూవీ చేశారు. 2013లో విడుదలైన ఈ చిత్రానికి నందినీ రెడ్డి డైరెక్టర్. దీంతో ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: