రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో మరో ఊహించని ట్విస్ట్..!?

Anilkumar
టాలీవుడ్ టైర్ 2 హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్ తన ప్రేయసి కి సంబంధించిన వివాదం ఎంత పెద్ద దుమారాన్ని లేపుతుందో ప్రత్యేకంగా చెప్పినవసరం లేదు. హీరో రాజ్ తరుణ్ పై తన ప్రేయసి లావణ్య ఫిర్యాదు చేసింది. లావణ్య పై మరో హీరోయిన్  ఫిర్యాదు చేసింది. అయితే హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య అనే అమ్మాయి మీడియా ముందుకు వచ్చింది. అయితే హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాయలో పడి తనని దూరం పెట్టాడంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్‌ని వదిలేయకపోతే మాల్వి, ఆమె సోదరుడు కలిసి తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని

 ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన రాజ్ తరుణ్  లావణ్య పై కూడా కేసు పెట్టాడు.  ఇదే విషయమై ఇప్పుడు మరోసారి ఫిర్యాదు చేసింది తిరగబడరా సామీ హీరోయిన్. . తనని తన తమ్ముడిని లావణ్య బెదిరింపులకు గురి చేస్తుందని ఫిర్యాదులో పేర్కొంది. తన సోదరుడికి లావణ్య మెసేజ్‌ లు పంపిస్తోందని, తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని మాల్వి మల్హోత్రా ఫిల్మ్‌నగర్‌ PSలో ఫిర్యాదు చేసింది. దీంతో ఫిల్మ్‌నగర్‌ పోలీసులు లావణ్యపై కేసు నమోదు చేశారు.  ఆమె బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.  రాజ్ తరుణ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. గడిచిన 6 నెలలుగా ఆయనతో కనీసం

 మాట్లాడింది కూడా లేదంది మాల్వి. రాజ్ తరుణ్‌తో కలిసి నటించిన ప్రతి హీరోయిన్‌ను లావణ్య ఇలాగే వేధిస్తోందని.. అలాగే తనకు కూడా మెసేజ్‌లు, కాల్స్ చేసి టార్చర్ చేస్తోందని మాల్వీ ఆరోపించింది. తన కుటుంబం నుంచి ఎవరూ లావణ్యను బెదిరించడం లేదని.. ఆమె తమను బ్లాక్ మెయిల్ చేస్తోందని మాల్వీ మల్హోత్రా ఫిర్యాదులో పేర్కొంది. తన కుటుంబం నుంచి ఎవరూ లావణ్యను బెదిరించడం లేదని.. ఆమె తమను బ్లాక్ మెయిల్ చేస్తోందని మాల్వీ మల్హోత్రా ఫిర్యాదులో పేర్కొంది. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్న లావణ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని మాల్వి కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: