ముంబైకి మకాం మార్చిన మంచు లక్ష్మి.. అదే ప్లానా..!?

Anilkumar
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసురాలిన సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మి. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా కూడా టాలీవుడ్ లో తన సత్తా చాటుతోంది. తండ్రి చూపిన బాటలోనే అందరిని అలరిస్తూ దూసుకుపోతోంది. అవకాశం వచ్చినప్పుడు యాక్టింగ్ చేస్తోంది. అయితే తాజాగా హైదరాబాద్ నుండి ముంబైకి మకాం మార్చింది మంచు లక్ష్మి. ఎందుకు ఏంటి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి ఇటీవల ముంబైకి షిఫ్ట్ అయింది.

 ఎందుకంటే కెరియర్ను సరికొత్తగా ప్రారంభించాలి అని అక్కడికి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ లో అవకాశాల కోసమే ముంబైకి వెళ్ళిందట మంచు లక్ష్మి. ఆడిషన్స్ ఇవ్వడానికి ప్రస్తుతం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ లో ఎవరితో వర్క్ చేయాలని ఉందో కూడా ఆ మధ్య వెల్లడించింది మంచు లక్ష్మి. నాలుగు పదుల వయసులో కూడా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా కనిపిస్తూ ఉంటుంది ఈ భామ. అయితే ముంబై షిఫ్ట్ అవ్వడం గురించి రీసెంట్ గా మరోసారి ఓ ఇంటర్వ్యూలో స్పందించింది మంచు డాటర్. ముంబైలోనే ఉంటున్నారా, లేకుంటే పూర్తిగా షిఫ్ట్ అయ్యారా అని మంచు లక్ష్మిని హోస్ట్ అడిగారు. "నా ఫ్రెండ్స్

 అందరూ నన్ను తిడుతున్నారు. ముంబై ముంబై అంటావ్.. హైదరాబాద్ లోనే ఎక్కువ కనిపిస్తున్నావు అని అంటున్నారు. బ్రేక్ ఫాస్ట్ అక్కడ.. డిన్నర్ ఇక్కడ అన్నట్లు అయింది నా పరిస్థితి" అని తెలిపింది మంచు లక్ష్మి. "పాప స్కూల్ కు మాత్రం అక్కడే వెళ్తోంది. ప్రయోగాల కోసమే ముంబై వెళ్లాను. ఫిల్మ్ మేకర్ గా ఎక్స్పరిమెంట్ చేసేందుకే వెళ్లాను. నిర్మాతగా, యాక్టర్ గా, ఓటీటీ స్టార్ గా సత్తా చాటేందుకు చాలా వర్క్ ఉంది. ఇక్కడ ఉంటే ఇంతే అనుకుంటాం.. కానీ అక్కడికి వెళ్తే ఇన్ని చేయవచ్చా అని కచ్చితంగా అనిపిస్తుంది" అని చెప్పింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: