చిరు.. అశ్వని దత్ కాంబోలో రెండు ఇండస్ట్రీ హిట్స్.. అవేంటో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్ లకి అద్భుతమైన క్రేజ్ ఉంది. అలాంటి కాంబినేషన్ లలో మెగాస్టార్ చిరంజీవి , నిర్మాత అశ్వినీ దత్ కాంబినేషన్ ఒకటి. వీరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు నాలుగు సినిమాలు రూపొందిగా అందులో ఏకంగా రెండు సినిమాలు తెలుగు ఇండస్ట్రీ హిట్ లుగా నిలిచాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి నిర్మాత అశ్విని దత్ కాంబినేషన్ లో మొదటగా జగదేక వీరుడు అతిలోక సుందరి అనే మూవీ రూపొందింది. ఈ సినిమాలో శ్రీ దేవి హీరోయిన్ గా నటించగా ... దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఇకపోతే ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇక ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిసింది. దానితో ఈ మూవీ అప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత వీరి కాంబినేషన్ లో చూడాలని ఉంది అనే మూవీ రూపొందింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. చిరు , అశ్విని దత్ కాంబినేషన్ లో మూడవ మూవీగా ఇంద్ర సినిమా రూపొందింది.

ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే హీరోయిన్ లుగా నటించగా ... బి గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకొని అదిరిపోయే సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేసి అప్పటి వరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక వీరి కాంబినేషన్లో నాలుగవ మూవీ గా జై చిరంజీవ మూవీ రూపొందింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇలా చిరు , అశ్వినీ దత్ కాంబినేషన్లో నాలుగు మూవీ లు రూపొందిగా , అందులో జగదేక వీరుడు అతిలోక సుందరి , ఇంద్ర సినిమాలు ఇండస్ట్రీ హిట్ లుగా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: