మహేష్, రాజమౌళి సినిమాలో విలన్ గా సలార్ నటుడు..!?

Anilkumar
త్రిబుల్ ఆర్ సినిమాతో తెలుగు సినిమాల సత్తా ఏంటో చూపించిన దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమాను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేస్తున్నాడు. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసి దాదాపుగా రెండేళ్లు దాటిపోయింది. కానీ ఇప్పటివరకు షూటింగ్ మాత్రం ప్రారంభించలేదు. ఇందులో భాగంగానే మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా స్టార్ట్ చేస్తారా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. కానీ

 ఇప్పటివరకు దానికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం లేదు. కనీసం పూజ కార్యక్రమాలు చేశారా అంటే అది కూడా లేదు. అయితే మహేష్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో అడ్వెంచర్ ఆక్షన్ డ్రామాగా తెరకెక్కబోతోంది. ఇందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన ఏవో ఒక వార్తలు తరచూ సోషల్ మీడియాలో వినబడుతూనే ఉంటాయి. అలా ఇప్పుడు కూడా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వినబడుతుంది. అదేంటంటే.. ఈ చిత్రంలో మహేష్ కు ధీటైన విలన్ కోసం

 రాజమౌళి వెతుకుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఆ విలన్ దొరికేసాడని టాక్ నడుస్తోంది.  హీరోగా, విలన్ గా తనదైన నటనతో అలరిస్తున్న మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ను జక్కన్న విలన్ గా కన్ఫర్మ్ చేసినట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. సలార్ సినిమాలో వరదరాజ మన్నార్ పాత్రలో పృథ్వీరాజ్ నటన ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఇక ఆ నటనకు మెచ్చి.. జక్కన్న SSMB29లో కీలకమైన విలన్ రోల్ లో పృథ్వీరాజ్ అయితే బావుంటుందని ఇదే ఈ విషయంపై రాజమౌళి – పృథ్విరాజ్ మధ్య కొంతకాలంగా చర్చలు సాగుతున్నాయని. ఆయనకు కూడా కథ నచ్చడంతో ఈ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సోషల్ మీడియా కోడై కూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: