సెలబ్రిటీస్ వద్దు.. సామాన్యులే ముద్దు అంటున్న బిగ్ బాస్..!

lakhmi saranya
ప్రముఖ టీవీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ఈ రియాలిటీ షో ప్రారంభం కాగానే చాలామంది విశ్లేషకులు తమ టెలివిజనులకు అండ్ మొబైల్ షోలకు అతుక్కుపోయారు . అందుకే టీవీ షో బిగ్ బాస్ కు అన్ని భాషల్లో టాప్ రేటింగ్ వస్తుంది . ఇక ఈ రియాలిటీ షో తెలుగులోనూ పాపులర్ అయింది . ఏడు సీజన్లు పూర్తి చేసుకుని సీజన్ 8 లోకి అడుగు పెట్టేందుకు రెడీ అయింది .  మరీ ముఖ్యంగా గత సీజన్ టిఆర్పి రికార్డ్లను తెరగా రాసింది .
అయితే బిగ్బాస్ సీజన్ 8 ఎప్పుడు ప్రారంభమవుతుంది అని టీవీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు . ఇక దీని ఆధారంగానే సీజన్ ఎయిట్ కి రంగం సిద్ధం చేసినట్లు ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఈసారి సెలబ్రిటీల కంటే బిగ్ బాస్ చూపు సామాన్యుల వైపే ఎక్కువగా ఉందట . ఇక ఈ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఒక సామాన్యుడు . ఇక  వచ్చిన చిన్న అవకాశాన్ని వినియోగించుకుని తన కెరీర్ ని తిరగా రాసుకున్నాడు పల్లవి ప్రశాంత్.

నేనొక రైతు బిడ్డని జై జవాన్ జై కిసాన్ అనే టాక్ తో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . ఇక దీంతో ప్రేక్షకుల సపోర్ట్ కామన్ మాన్ ఎక్కువగా ఉంటుందని తెలుసుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది . ఇక  సెలబ్రిటీస్ ని పెట్టి తిట్లు తినే కంటే సామాన్యులకే అవకాశం ఇవ్వడం బెటర్ అంటున్నారు పలువురు .  ఇక ఏదేమైనాప్పటికీ పల్లవి ప్రశాంత్ టోటల్ బిగ్బాస్ ని మార్చేశాడు అని చెప్పుకోవచ్చు . ప్రజెంట్ పల్లవి ప్రశాంత్ క్రేజ్ మూవీస్ అండ్ రాజకీయాల వైపుకు మల్లుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: