వెంకీ స్పీడ్ చూస్తుంటే టార్గెట్ మిస్ అయ్యేలా లేదుగా..?

Pulgam Srinivas
సూపర్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలో విక్టరీ వెంకటేష్ ఒకరు. వెంకటేష్ ఈ మధ్య కాలంలో బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయం అందుకొని చాలా కాలం అవుతుంది. మధ్యలో ఈయన నటించిన దృశ్యం 2 , నారప్ప మూవీ లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించినప్పటికీ ఈ రెండు మూవీ లు కూడా థియేటర్లలో కాకుండా ఓ టీ టీ లో విడుదల అయ్యాయి. ఇక చాలా కాలం తర్వాత వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాపై వెంకీ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

కాకపోతే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ తర్వాత ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలి అని మూవీ బృందం చాలా రోజుల క్రితమే ఫిక్స్ అయింది. కాకపోతే ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం కావడంతో సంక్రాంతి కి చాలా తక్కువ సమయం ఉండడంతో ఈ మూవీ సంక్రాంతి కి విడుదల కావడం కష్టమే అని కొంతమంది అనుకున్నారు. కాకపోతే అనిల్ రావిపూడి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను పక్కాగా పూర్తి చేసుకుని ఈ మూవీ షూటింగ్ ను ప్రారంభించాడు. దానితో ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతి కి రాబోతున్నట్లు కనబడుతుంది.

ఇక ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క షూటింగ్ ను హైదరాబాదులోని కోటి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ బృందం చిత్రీకరిస్తున్న సన్నివేశాలలో వెంకటేష్ కూడా పాల్గొంటున్నాడు. ఇక వెంకీ కూడా ఈ సినిమా షూటింగులు పూర్తి చేసే వరకు వేరే మూవీ కూడా స్టార్ట్ చేయకూడదు అని డిసైడ్ అయినట్లు దానితో చాలా స్పీడ్ గా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసి ఈ మూవీ ని సంక్రాంతికి విడుదల చేయాలి చేయడానికి మూవీ యూనిట్ ఫిక్స్ తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా కనిపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: