ఎన్టీఆర్ కోసం కృష్ణ పేపర్ ప్రకటన.. దీని వెనక అసలు కారణం ఇదే..!

Amruth kumar
తెలుగు చిత్ర పరిశ్రమకు మొదటి తరం హీరోలుగా ఎన్టీఆర్ , ఏఎన్నార్ , కృష్ణ , శోభన్ బాబు , కృష్ణంరాజు తమ సినిమాలతో స్టార్ హీరోలుగా పోటీపడి నటించారు. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ , కృష్ణ , ఏఎన్ఆర్ మధ్య గట్టి పోటీ ఉండేది. కొన్ని సమయాల్లో  కృష్ణ పై ఎన్టీఆర్ పై చేయి సాధిస్తే.. కొన్నిసార్లు వీరిపై నాగేశ్వరరావు పై చేయి సాధించేవారు. అదే సమయంలో ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమను వదిలి రాజకీయాల్లో అడుగుపెట్టి కేవలం 9 నెలలోనే ముఖ్యమంత్రి అయి సంచలనం సృష్టించారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని.. తెనాలి రత్న థియేటర్లో చూసిన పాతాళభైరవి సినిమా కృష్ణ మనసులో చెరగని ముద్ర వేసుకుంది.

అలా చిత్ర పరిశ్రమలోకి రావటానికి చెన్నై వెళ్ళినప్పుడు కృష్ణ ముందుగా ఎన్టీఆర్నే  కలిశారట.. తర్వాత హీరోగా అడుగుపెట్టి స్టార్ హీరోగా మారిన తర్వాత అయినా నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఈనాడు కూడా ఒకటి.. ఈ సినిమాను మలయాళం లో సూపర్ హిట్ సాధించిన ఈనాడు సినిమాకు రీమేక్గా తెరకెక్కించారు. మొదట ముత్యాల ముగ్గు శ్రీధర్ ను హీరోగా పెట్టి ఈ సినిమాను చేయాలని భావించారు. అదేవిధంగా పి.సాంబశివరావును దర్శకుడిగా ఎంపిక చేసి పరుచూరి బ్రదర్స్‌కు అప్పగించారు. కానీ ఈ సినిమాలో కృష్ణ హీరోగా నటిస్తే బాగుంటుందని పరుచూరి బ్రదర్స్ దర్శకుడికి చెప్పారట.

అదేవిధంగా కృష్ణ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే విధంగా మార్పులు చేసి మాటలు రాసుకున్నారట పరుచూరి బ్రదర్స్‌. అలా కృష్ణ 200వ సినిమాగా ఈనాడు ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. 1982 డిసెంబర్ 17న విడుదలై సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాలో కృష్ణ సైకిల్ తొక్కుతూ పాడే పాట ఆ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమాలో పాటను చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్‌కు మద్దతుగా కృష్ణ ఈ పాటలో నటించారని అప్పట్లో భావించారు. సరిగ్గా ఈనాడు సినిమా విడుదలైన రెండు వారాల తరువాత టీడీపీ విజయం సాధించింది. దీంతో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్‌ను అభినందిస్తూ.. కృష్ణ ఓ పేపర్‌లో యాడ్ కూడా వేశారు. అది అప్పట్లో సంచలనమనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: