స్టార్ హీరోయిన్ తో మూవీ సెట్ చేసుకున్న మహారాజా డైరెక్టర్.. ఈసారి అలాంటి కథతో..?

Pulgam Srinivas
విజయ్ సేతుపతి తాజాగా మహారాజా అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ విజయ్ కెరీర్లో 50వ మూవీ గా రూపొందింది. ఈ సినిమా విజయ్ కెరియర్లో 50వ సినిమాగా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీపై మొదటి నుండి ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఒకే రోజు తమిళ్ మరియు తెలుగు భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది. మరి ముఖ్యంగా ఈ సినిమాలోని విజయ్ నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.

ఇకపోతే ఈ బ్లాక్ బస్టర్ మూవీ కి నిథిల‌న్ సామినాథ‌న్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో ఈ దర్శకుడికి కూడా మంచి గుర్తింపు లభించింది. ఇలా మహారాజా సినిమాతో ఈ దర్శకుడికి మంచి పేరు రావడంతో ఈయన దర్శకత్వంలో పని చేయడానికి అనేక మంది తమిళ నటీనటులు ఉత్సాహ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మహారాజా సినిమా విడుదల అయిన కొన్ని రోజులకే ఈ దర్శకుడు మరో మూవీ ని సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని లేడీ ఓరియంటెడ్ మూవీ గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా తన తదుపరి మూవీ లో నయనతార ను ప్రధాన పాత్రలో తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ దర్శకుడు నయనతార ను కలిసి ఓ స్టోరీ లైన్ ను వినిపించగా , ఈ దర్శకుడు చెప్పిన కథ అద్భుతంగా నచ్చడంతో వెంటనే నయన తార , నిథిల‌న్ సామినాథ‌న్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం నయన తార వరుస విజాయలతో ఫుల్ జోష్ లో ఉండడం , మహారాజా లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నిథిల‌న్ సామినాథ‌న్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: