"ఓయ్" మూవీ గురించి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్.. దండం పెట్టేసిన డైరెక్టర్..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో సిద్ధార్థ్ ఒకరు. ఈయన శంకర్ దర్శకత్వంలో రూపొందిన బాయ్స్ అనే తమిళ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈ నటుడికి ఈ మూవీ తర్వాత నేరుగా తెలుగు సినిమాలలో అవకాశాలు రావడం మొదలు అయ్యింది. అందులో భాగంగా ఈ నటుడు నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , చుక్కల్లో చంద్రుడు , బావ మరికొన్ని సినిమాలలో కూడా హీరోగా నటించాడు.

ఈ నటుడు కెరియర్ మంచి జోష్ లో ఉన్న సమయంలో ఓయ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శాలిని హీరోయిన్గా నటించగా , ఆనంద్ రంగ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డి వి వి దానయ్య నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమా విడుదల సమయంలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కానీ ఆ తర్వాత మాత్రం ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు రావడం మొదలు అయింది. ఇకపోతే తాజాగా ఈ సినిమా విడుదల అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది.

దానితో ఈ మూవీ దర్శకుడు సోషల్ మీడియా వేదికగా నేటిజెన్ లతో ముచ్చటించాడు. అందులో భాగంగా ఓ నెటిజన్ ఈ సినిమాను రీ రిలీజ్ చేయవచ్చు కదా అని అడిగాడు. దానితో ఈ దర్శకుడు ఏమి స్పందించకుండా దండం సింబల్ ను పెట్టి సైలెంట్ గా ఉన్నాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ థియేటర్లలో రీ రిలీజ్ అయింది. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. ఈయన అందించిన సంగీతం కూడా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: