ఆ దర్శకుడికి నో చెప్పిన రవితేజ..? కారణం అదే..?

MADDIBOINA AJAY KUMAR
మాస్ మహారాజా రవితేజ ఆఖరుగా ఈగల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇక ప్రస్తుతం రవితేజ , హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా కనిపించబోతుంది. ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇకపోతే ఈ మూవీ తర్వాత రవితేజ "జాతి రత్నాలు" మూవీ దర్శకుడు అయినటువంటి అనుదిప్ కే వి దర్శకత్వంలో మూవీ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ఆగిపోయినట్లు తెలుస్తోంది. అసలు ఎందుకు ఈ సినిమా ఆగిపోయింది అనే వివరాల్లోకి వెళితే ... కొంత కాలం క్రితం అనుదీప్ , రవితేజకు ఒక స్టోరీని చిన్న లైన్ గా చెప్పాడట. అది బాగుండడంతో దానిని డెవలప్ చెయ్ అని సూచించాడట. కొన్ని రోజుల క్రితమే అనుదీప్ , రవితేజకు తాను తయారు చేసిన ఫుల్ కథ ను వినిపించాడట. కాకపోతే ఈయన చెప్పిన స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు , చేర్పులను రవితేజ సూచించాడట.

దానితో మరికొంత సమయం తీసుకున్న అనుదీప్ కొన్ని మార్పులు , చేర్పులను చేసి రవితేజకు మళ్ళీ స్టోరీని వినిపించాడట. కాకపోతే అనుదీప్ చేసిన మార్పులు , చేర్పులు రవితేజకు పెద్దగా నచ్చలేదట. దానితో ఈ సినిమాను ఇలా తీస్తే వర్కౌట్ కాదు అనే ఉద్దేశంతో రవితేజ మంచి కథ ఉంటే మళ్ళీ రా సినిమా చేద్దాం అని ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక రవితేజ "మిస్టర్ బచ్చన్" సినిమా తర్వాత ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అనే దానిపై అధికారిక ప్రకటన వెలబడలేదు. మరి రవితేజ తన తదుపరి మూవీ ని ఎవరితో చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: