వాళ్ల కోసమే కల్కి సినిమా చేయాల్సి వచ్చింది.. మృణాల్ షాకింగ్ కామెంట్స్..!?

Anilkumar
ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. జూన్ 27న థియేటర్‌లలోకి వచ్చిన ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారీ తారాగణమే ఉంది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ కలెక్షన్ మొదటి రోజు రూ.180 కోట్ల వరకు వసూలు చేసింది. అయితే 2వ రోజు ఈ వసూళ్లు గణనీయంగా పడిపోయినట్లు తెలుస్తోంది. తొలి రోజుతో చూస్తే సినిమాపై ఇప్పుడు భిన్నమైన టాక్ వినిపిస్తోంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన

 సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ మూవీ కల్కి 2898 ఏడీ ఇప్పటివరకు  భారతీయ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్స్ నమోదు చేసిన 3వ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 సినిమాల తర్వాత కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద రూ. 191.5 కోట్లతో భారీ ఓపెనింగ్స్ కలెక్ట్ చేసింది. ఐతే కల్కి సినిమా సినిమాలో ప్రభాస్ కి ఈక్వల్ రోల్ చేశారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. సినిమా లో ప్రభాస్ తర్వాత హైలెట్ గా చెప్పుకునే అంశాల్లో అమితాబ్ రోల్ ఒకటి. ఆయన చేసిన అశ్వద్ధామ రోల్ ఇంకా ఆ యాక్షన్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ లో అనిపించాయి.

 ఇందులో కేవలం అమితాబచ్చన్ మాత్రమే కాకుండా చాలామంది సినీ సెలబ్రిటీలు అతిథి పాత్రలో కనిపించారు. విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ రాజమౌళి అనుదీప్ ఫరియా అబ్దుల్లా రాంగోపాల్ వర్మ మృనాల్ ఠాగూర్ ఇలా చాలామంది  సినీ సెలబ్రిటీస్ ఇందులో అతిధి పాత్రలో కనిపించారు. ఇందులో భాగంగానే తాజాగా మృణాల్ ఈ సినిమా పై పులు షాకింగ్ కామెంట్స్ చేసింది. కల్కి లో అంత చిన్న పాత్ర ఎందుకు చేశారంటూ మృణాల్ కు ఆమె ఫ్యాన్స్ అడుగుతుండగా.. అసలు విషయం చెప్పేసింది. “కల్కిలో కేమియో చేయాలని మూవీ టీమ్ నన్ను సంప్రదించినప్పుడు నేను ఒక్క ముక్క కూడా అడగలేదు. నిర్మాతలు అశ్వినిద్, ప్రియాంక దత్, స్వప్న దత్ ముగ్గురిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. కథ గురించి కానీ నా పాత్ర గురించి కానీ ఏం అడక్కుండానే యస్ చెప్పాను. కల్కి సూపర్ హిట్ అవుతుందని తెలుసు. ఇలాంటి గొప్ప ప్రాజెక్టులో భాగం అయినందుకు సంతోషంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మృణాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: