రాయలసీమ యాసలో మెప్పించబోతున్న నేషనల్ క్రష్...?

murali krishna
కన్నడ సోయగం ‘రష్మిక మందన్న’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్రలో యిట్టే ఒదిగిపోతారు. ముఖ్యం గా పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లో శ్రీవల్లి పాత్ర ఆమె కోసమే పుట్టుందేమో అనిపిస్తుంది. శ్రీవల్లి పాత్ర లో అంతలా రష్మిక ఆకట్టుకున్నారు. సీమ యాస, ఆహార్యం ఆమెకు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చాయి. పుష్ప-2లోనూ మళ్లీ ఆ పాత్రలోనే రష్మిక కనిపించనున్నారు. అయితే పుష్ప-2 తర్వాత మరోసారి సీమ యాస, ఆహార్యంతోనే నేషనల్ క్రష్ తెర పై సందడి చేయనున్నారు.పుష్ప సినిమాలో శ్రీ వల్లీ పాత్రను చూసిన ఎవ్వరైనా సరే ఆ రోల్కు ఆమే కరెక్ట్ ఛాయిస్ అని అంటుంటారు. అంతలా ఆ పాత్ర లో ఒదిగిపోయింది నటి రష్మిక మందన్న. ఓ వైపు యాక్టింగ్తో అదరగొడుతూనే మరోవైపు రాయలసీమ యాశలోనూ అంతే బాగా మాట్లాడింది. 'పుష్ప 2'లోనూ మళ్లీ అదే పాత్రలతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. అయితే తాజా గా రష్మిక గురించి ఓ వార్త నెట్టింట తెగ్ ట్రెండ్ అవుతోంది. 'పుష్ప2' తర్వాత మరోసారి సీమ యాస మాట్లాడే ఓ పాత్రలో నటించనుందట ఈ అమ్మడు.విజయ్‌ దేవరకొండ, రాహుల్‌ సంకృత్యాన్‌ కాంబోలో తెరకెక్కనున్న పీరియాడిక్‌ డ్రామాలో హీరోయిన్ గా రష్మికను తీసుకునేందుకు ప్లాన్లో ఉన్నారట. తన పాత్ర దాదాపు ఖాయమైనట్టే అని సమాచారం. ఇది పూర్తిగా రాయలసీమలోని కర్నూలు నేపథ్యంలో సాగే కథ గనుక రష్మిక మరోసారి సీమ యాసలో మాట్లాడనున్నట్లు సమాచారం.ప్రస్తుతం రష్మిక మందన్న వరుస సినిమాల తో ఫుల్ బిజీగా ఉన్నారు. యానిమల్ హిట్ కావడంతో వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ది గర్ల్‌ఫ్రెండ్‌, కుబేర, సికందర్‌ తదితర చిత్రాల్లో రష్మిక నటిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ తో కలిసి రష్మిక ఇప్పటికే రెండు సినిమాలు చేశారు. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో ఇద్దరు నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: