బైక్స్ నడిపే యూత్ కు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.... డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత... దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ప్రజా సమస్యలు తీర్చడంలో ముందు వరుసలో ఉంటున్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికల కంటే ముందు చెప్పినట్లుగానే... నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ... అన్ని తానే చూసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో... డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు.

గెలిచిన తర్వాత...  పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటించడం ఇదే మొదటిసారి. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ యూత్ కు వార్నింగ్ ఇచ్చారు. ఎవరు కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని బండ్ల పైన రాసుకోకూడదని... ఫన్నీగా  మాట్లాడారు పవన్ కళ్యాణ్.  ఏపీ అసెంబ్లీ ఎన్నికల హడావిడి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా  పిఠాపురం గారి తాలూకా  అనే పదం బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
చాలామంది ఆటోల వెనుక.. బండ్ల నెంబర్ ప్లేట్ల పైన...  పిఠాపురం వారి తాలూకు అంటూ రాసుకుం టున్నారు. కొంతమంది కార్ల అద్దాలపై కూడా రాసుకుంటున్నారు. అయితే పిఠాపురం లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్... ఇదే అంశాన్ని తెరపైకి తీసు కువచ్చారు. నెంబర్ ప్లేట్ కనిపించకుండా పిఠాపురం గారి తాలూకా అంటూ రాసుకోవడం నేరమని... ఆ పేర్లను తీసేసి నెంబర్ ప్లేట్ కనిపించేలా చూసు కోవాలని యూత్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.
తన పేరు వల్ల... మీరు చిక్కుల్లో పడతారని... పోలీసులకు కూడా ఇబ్బంది జరుగుతుందని ఆయన వెల్లడిం చారు. కాబట్టి ఇక పైన ఇలాంటి రాతలు రాయకుండా... నెంబర్ ప్లేట్లు కనిపించేలా చూసుకోవాలని.. కోరారు. ఇక దీనిపై పవన్ కళ్యాణ్ మాట్లాడడంతో అక్కడ ఉన్న యూత్ అలాగే ప్రజలు  దద్దరిల్లి పోయేలా రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగానే తాము ఫాలో అవుతామని యూత్ చెపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: