క్యాన్సర్ మహమ్మారితో పోరాడిన హీరోయిన్స్..?

Divya
సినీ సెలెబ్రిటీలు అనగానే చాలామంది లగ్జరీ లైఫ్ ఉంటుందని భావిస్తూ ఉంటారు. కానీ వారు కూడా సాధారణ మనుషులు లాగానే ఎన్నో అవమానాలు కష్టాలను వ్యాధులను సైతం ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడ్డ హీరోయిన్స్ సైతం చాలామంది ఉన్నారు.వారి గురించి ఇప్పుడు చూద్దాం.

ముందుగా బాలీవుడ్ నటి హీనా ఖాన్ ఇటీవల బ్రెస్ట్ క్యాన్సర్-3 స్టేజ్లో బాధపడుతున్నట్లు తెలియజేసింది. కానీ తన ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఆరోగ్యంగానే ఉన్నానంటూ చికిత్స తీసుకుంటున్నాను అంటూ తెలిపింది. హినా ఖాన్ కంటే ముందుగానే చాలామంది సెలబ్రిటీలు కూడా క్యాన్సర్ బారిన పడి పోరాడి గెలిచారు.. అలాంటి వారిలో ముందుగా హీరోయిన్ హంసానందిని కూడా ఒకరు.ఎన్నో స్పెషల్ సాంగ్లలో నటించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో ప్రత్యేకమైన స్థానం అందుకుంది.. 2020లో క్యాన్సర్ బారిన పడ్డట్టుగా తెలిపింది. తాను కూడా గ్రేడ్ 3 కార్సినోమా ఉన్నట్లుగా తెలిపింది. ఆ వెంటనే చికిత్స తీసుకొని కోరుకుంది.

మరొక హీరోయిన్ మనీషా కొయిరాలా 2012 లో అండాశయ్య క్యాన్సర్ తో బాధపడింది. ఆ తర్వాత చికిత్స చేయించుకుని ఏడాది పాటు పోరాడిన ఈమె క్యాన్సర్ నుంచి విముక్తి పొందింది. అలాగే హిరోయిన్ గా పేరుపొందిన సోనాలి బింద్రే కూడా  2018లో క్యాన్సర్ బారిన పడ్డ ఈమె మెటస్టాటిక్ క్యాన్సర్ తో పోరాడి చికిత్స తీసుకొని బయటపడింది. అదేవిధంగా కమలహాసన్ మాజీ భార్య గౌతమ్ కూడా ఈ భయంకరమైన వ్యాధిన పడింది.35 ఏళ్ల వయసులో ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకిందట అమెరికాకు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకొని నెమ్మదిగా కోరుకుంది. అలాగే హీరోయిన్ మమతా మోహన్ దాస్ కూడా ఈ క్యాన్సర్ ను జయించింది. 2009 హాడ్కిన్ లింఫోయ్య క్యాన్సర్ బారిన పడింది. నెమ్మదిగా చికిత్స చేయించుకుని బయటపడింది. ఇక విరే కాకుండా నటి మహిమా చౌదరి కూడా రొమ్ము క్యాన్సర్ బారిన పడి చికిత్స అనంతరం కోలుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: