కల్కి నిర్మాతల గురించి.. నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనమే సృష్టిస్తుంది అని చెప్పాలి. నాగ్ అశ్విన్ తన కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ ఏకంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటిలా చేసింది. హాలీవుడ్ మూవీ ని మించిపోయేలా ఇక ఈ సినిమాలోని గ్రాఫిక్స్ యాక్షన్ సన్నివేశాలను నాగ్ అశ్విన్ తెరకెక్కించారు అని చెప్పాలి.

 కేవలం నాలుగు రోజుల్లోనే 552 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ మూవీ ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎన్నో రికార్డులను తిరగరాసేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులందరూ కూడా అటు డైరెక్టర్ నాగ్ అశ్విన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి సినిమాలు మునుపేన్నడు చూడలేదు అంటూ రివ్యూల మీద రివ్యూలు ఇచ్చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా ప్రభాస్ హీరోగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన కల్కి సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో.. ఇటీవల డైరెక్టర్ నాగ్ అశ్విన్ పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 పదేళ్ల క్రితం స్వప్న దత్ ప్రియాంక దత్ నేను కలిసి ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమా తీశాం. ఈ సినిమా ఎంతో రిస్క్ తో కూడుకున్నది. అదనపు ఖర్చు అందరినీ ఆందోళనకు గురి చేసింది. కానీ పదేళ్ల తర్వాత చూస్తే మా కాంబినేషన్ లో తీసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అయ్యి మైలురాయిగా నిలిచింది అంటూ నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.  వీరి మధ్య నిలబడటం గర్వంగా ఆశీర్వాదంగా భావిస్తున్నాను అంటూ నాగ్ అశ్విన్ పెట్టిన పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: