మళ్లీ రిస్క్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్.. ఈసారి ఆ తమిళ్ సినిమాతో..!?

Anilkumar
టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ లతో బాధపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఇటీవల చత్రపతి రీమేక్ తో బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చాడు ఈ హీరో. కానీ ఇది కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. చత్రపతి పెద్ద డిజాస్టర్ గా మారడంతో ఆయనకి చాలా పెద్ద గ్యాప్ వచ్చింది అని చెప్పాలి. మళ్లీ ఇప్పుడిప్పుడే సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు ఈ హీరో. టాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలను లైన్లో పెట్టినట్లుగా తెలుస్తోంది. రెగ్యులర్ కమర్షియల్

 ఫార్ములాకు భిన్నంగా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలో చేయాలి అని అనుకుంటున్నాడట శ్రీనివాస్. ప్రస్తుతం టైసన్ నాయుడు అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సైతం స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో కాకుండా టాలీవుడ్ లో మరో సినిమాని కూడా లైన్లో పెట్టాడట బెల్లంకొండ. రీసెంట్ తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ ‘గరుడన్’ రీమేక్‌లో బెల్లంకొండ హీరో నటించనున్నారట. ఈ సినిమా

 హక్కులను కేకే రాధామోహన్ తీసుకున్నారని, విజయ్ కనకమేడల డైరెక్షన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ్ చిత్రం రాచ్చసన్‌ను తెలుగులో రాక్షసుడు పేరుతో రిలీజ్ చేసి సాయి శ్రీనివాస్‌ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ తమిళ్ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అయ్యారట.  గరుడన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాకు కోలీవుడ్ అగ్ర దర్శకుడు వెట్రిమారన్ కథను అందించగా.. ఆర్ఎస్ దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వం వహించాడు. ఇందులో సూరి, శశికుమార్‌తో పాటు ఉన్ని ముకుందన్ హీరోలుగా నటించారు.   31న థియేటర్లలో రిలీజైన గరుడన్ పెద్ద హిట్‌గా నిలిచింది. దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. యాభై కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: