ఆ ఒక్క కోరిక తీర్చండి ప్లీజ్.. బాబుకు ఉద్యోగుల విజ్ఞప్తి?
సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో వారానికి 5 రోజులు పనిదినాలు విధానాన్ని మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంపై సిఎం చంద్రబాబుకు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో పనిలో పనిగా గత పిఆర్సీ ప్రకటన సందర్భంగా సచివాలయం, హెచ్ వో డిలలో పనిచేసే ఉద్యోగులకు 24శాతం హెచ్ ఆర్ ఏ గడువును పొడిగించాలని విజ్జప్తి చేశారు. పీఆర్సీ లో 24శాతం హెచ్ ఆర్ ఏ ను జూన్ నెలను గడువుగా గత ప్రభుత్వం పేర్కొందని.. దాన్ని పొడిగించాలని విజ్జప్తి చేశారు. తమ అభ్యర్ధనపై సిఎం సానుకూలంగా స్పందించారని ఉద్యోగులు అంటున్నారు. మరి చంద్రన్న కరుణిస్తాడా అన్నది చూడాలి.