రేపు చంద్రబాబు మరో సంచలనం.. మీడియా ఫుల్‌ అలర్ట్‌?

Chakravarthi Kalyan
రేపు చంద్రబాబు మరో సంచలన ప్రెస్ మీట్‌ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే పోలవరం అంశంపై సుదీర్ఘమైన పవన్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన చంద్రబాబు అదే తరహా ప్రెస్‌ మీట్‌కు రెడీ అవుతున్నారు. ఈ సారి రాజధాని అమరావతిపై చంద్రబాబు ప్రెస్‌ మీట్‌ ఉండబోతోంది. రాజధాని అమరావతి వాస్తవ పరిస్థితి పై ఇప్పటికే సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. రేపు శ్వేత పత్రం విడుదల చేయబోతున్నారు.

చంద్రబాబు అమరావతి వాస్తవ పరిస్థితిపై  నిర్వహించిన సమీక్షకు పురపాలక శాఖ మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ సింఘాల్, సీఆర్డీఏ కమిషనర్ భాస్కర్, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఎండీ లక్ష్మీ పార్థసారథి హాజరయ్యారు. వీరితో చర్చించిన చంద్రబాబు రేపు అమరావతిపై ఫుల్‌ డిటైల్డ్ శ్వేతపత్రం విడుదల  చేయనున్నారు. చంద్రబాబు సీఎం కాగానే అమరావతిలో మళ్లీ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే అమరావతిలో క్షేత్రస్థాయిలో  పర్యటించి వాస్తవాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. దీనిపై రేపు ప్రజలకు వివరించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: