ఆ హీరోతో రొమాంటిక్ సీన్.. భయంతో బయటికి పరుగులు పెట్టాను.. శాలిని పాండే..!

Pulgam Srinivas
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ తో శాలిని పాండే వెండి తేరకు పరిచయం అయింది. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడం , అలాగే ఇందులో ఈమె తన నటనతో , అంతకుమించిన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు సూపర్ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఈ మూవీ తర్వాత ఈమెకు వరుస పెట్టి సినిమా అవకాశాలు వస్తాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ అలా అస్సలు జరగలేదు.

ఈమెకు తెలుగులో అర్జున్ రెడ్డి మూవీ తర్వాత పెద్దగా సినీ అవకాశాలు ఏమీ రాలేదు. ఈమె నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మహానటి అనే సినిమాలో ఓ చిన్న పాతలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత ఈమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఈమె హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. హిందీలో పర్వాలేదు అనే స్థాయి ఉన్న సినిమాలలో నటిస్తూ వస్తుంది. తాజాగా ఈ బ్యూటీ మహారాజా అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ నేరుగా కొన్ని రోజుల క్రితం నెట్ ఫ్లిక్స్ ఈ టి టి లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే తాజాగా షాలిని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా మహారాజ్ సినిమాలోని రొమాంటిక్ సన్నివేశాల గురించి చెప్పుకొచ్చింది.

శాలిని పాండే "మహారాజ్" మూవీ లో  కిషోరి పాత్రలో కనిపించింది. ఇందులో జైదీప్ అహ్లావత్‏తో రొమాంటిక్ సీన్ గురించి ఈమె మాట్లాడింది. అలాంటి సన్నివేశం చేస్తున్నప్పుడు ఆకస్మాత్తుగా తాను బయటకు వెళ్లానని తెలిపింది. ఆ రొమాంటిక్ సన్నివేశం తనపై ఎలాంటి ప్రభావం చూపిందో తెలియదని.. కానీ తనకు చీకటి గదిలో ఉండాలంటే చాలా భయమని చెప్పుకొచ్చింది. తనకు కాస్త సమయం కావాలని.. ప్రశాంతమైన వాతావరణం కావాలని దర్శకుడిని అడిగానని.. దీంతో వారు తన పరిస్థితిని అర్థం చేసుకున్నారని తాజా ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sp

సంబంధిత వార్తలు: