ఆ తేదీన బుల్లితెరపై కళ్యాణం కమనీయం..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి సంతోష్ శోభన్ కొంత కాలం క్రితం కళ్యాణం కమనీయం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలో తమిళ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ కొనసాగిస్తున్న ముద్దుగుమ్మలలో ఒకరు అయినటువంటి ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం అయింది.

ఈ మూవీ ద్వారా ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో పర్వాలేదు అనే స్థాయి గుర్తింపు లభించింది. అనిల్ కుమార్ అల్లా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం జనవరి 14 వ తేదీన సంక్రాంతి కానుకగా పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన టైమ్ కి బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి , చిరంజీవి హీరో గా రూపొందిన వాల్టేరు వీరయ్య సినిమాలు కూడా విడుదల కావడం ఈ మూవీ కి కూడా ప్రేక్షకుల నుండి మంచి టాక్ రాకపోవడంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ప్రభావం చూపలేదు.

బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన ఈ మూవీ సంతోష్ శోభన్ కి నిరాశ మిగిల్చింది. ఈ సినిమా ఆ తర్వాత ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే జీ తెలుగు ఛానల్లో ప్రసారం కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వెలబడింది. ఈ మూవీ ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈ ఆదివారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు జీ తెలుగు ఛానల్లో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ss

సంబంధిత వార్తలు: