ఎన్టీఆర్ ను మోసం చేసిన మహిళ.న్యాయం కోసం కోర్ట్ కు .!!
ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ తన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) కె రాజేశ్వరరావు ద్వారా డీఆర్టీ ముందు వాదించారు. పోలీసుల విచారణ ఇది తనపై జరిగిన మోసం అని నిశ్చయాత్మకంగా రుజువు చేసిందని, పోలీసులు తనకు స్థలం విక్రయించినవారిపై ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారని వాదించారు. ఆరు బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు.. వారి తప్పిదం నుంచి బయటపడేందుకు తన ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.అయితే డీఆర్టీలో వాదనలు ముగిసిన అనంతరం.. ఆ స్థలంపై బ్యాంకులకే హక్కులుంటాయంటూ తీర్పు ఇచ్చింది. 1996 నుంచి ఆస్తిపై తాత్కాలిక హక్కును కలిగి ఉన్నందున బ్యాంకుల క్లెయిమ్లకు ప్రాధాన్యత ఉందని డీఆర్టీ పేర్కొంది. మరోవైపు ఇందుకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. సుంకు గీత బ్యాంకు అధికారులతో కలిసి నటుడిని మోసం చేసిందని, అదే ఆస్తి పత్రాలను రుణాలు పొందేందుకు వివిధ బ్యాంకుల్లో తాకట్టు పెట్టారని నిర్ధారించారు. ప్లాట్ని జూనియర్ ఎన్టీఆర్కు విక్రయించే ముందు ఈ వాస్తవాన్ని దాచిపెట్టారని పోలీసులు తెలిపారు.
ఇక, డీఆర్టీ తీర్పుపై ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్టీఆర్ తన కోర్టు కేసులను డీల్ చేయడానికి నియమించుకున్న జీపీఏ రాజేశ్వరరావు ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ జే శ్రీనివాసరావులతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గాడి ప్రవీణ్ కుమార్.. డీఆర్టీ ఆర్డర్పై ఢిల్లీలోని అప్పిలేట్ ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకునే అవకాశం పిటిషనర్కు (జూనియర్ ఎన్టీఆర్) ఉందని తెలిపారు. అలాంటప్పుడు హైకోర్టుకు రాలేరని అన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. తమ వాదనలను రుజువు చేసేందుకు కొన్ని రికార్డులను అందజేస్తామని పేర్కొన్నారు. తదుపరి విచారణకు వెకేషన్ బెంచ్ ముందు ఈ అంశాన్ని పోస్ట్ చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. అయితే ఈ విషయాన్ని తదుపరి వెకేషన్ ముందు పోస్టు చేసందుకు ధర్మాసనం నిరాకరించింది. విచారణను జూన్ 6కు వాయిదా వేసింది.ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాల డాక్యుమెంట్లను జూన్ 3లోగా అందజేయాలని ఆదేశించింది.