అఫీషియల్ : "పుష్ప 2" కేరళ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

MADDIBOINA AJAY KUMAR
ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడి చాలా కాలమే అవుతుంది. ఈ సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను వరుసగా విడుదల చేస్తూ వస్తుంది.
 

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇక తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేసింది.  ఈ రెండింటికి కూడా ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ హక్కులను కూడా అమ్మివేస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా మేకర్స్ ఈ సినిమా యొక్క కేరళ థియేటర్ హక్కులను అమ్మివేశారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా యొక్క కేరళ హక్కులను E4 ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది.

ఈ విషయాన్ని తాజాగా ఈ సంస్థ వారు ప్రకటించారు. ఈ సినిమా యొక్క కేరళ థియేటర్ హక్కులు ఇప్పటికే ఈ సంస్థ చేతికి రావడంతో వీరు ఈ మూవీ ని కేరళలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలను ఇప్పటి నుండే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా కనిపించనుండగా ... సుకుమార్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్న ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa

సంబంధిత వార్తలు: