టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ ను ఫిక్స్ చేసుకున్న "అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్"..!

MADDIBOINA AJAY KUMAR
టాలెంటెడ్ నటుడు సుహాస్ కొంతకాలం క్రితం అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేసి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ లోని సుహాస్ నటనకి గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా ఆ తర్వాత కొంత కాలానికి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని మంచి కలెక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను కూడా భాగానే అలరించింది. ఇలా ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో బుల్లి తెరపై ప్రసారం కాబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలవడింది. ఈ మూవీ యొక్క సాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ సంస్థలలో ఒకటి అయినటువంటి "స్టార్ మా" సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ మూవీ ని ఏప్రిల్ 28 , 2024 న మధ్యాహ్నం 1:00 గంటకు ప్రసారం చేయనున్నట్లు స్టార్ మా సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి థియేటర్ "ఓ టి టి" ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇకపోతే దుశ్శాంత్ కటకనేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో శివాని నాగారం , శరణ్య ప్రదీప్ , గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ కి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: