రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ యువ నటుడికి గాయాలు..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో నవీన్ పోలిశెట్టి ఒకరు. ఈయన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే మూవీ తో హీరో గా మంచి విజయాన్ని అందుకొని సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈ నటుడు జాతి రత్నాలు అనే మూవీ లో హీరో గా నటించాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇక ఈ మూవీ లో నవీన్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ మూవీ తో ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

ఇకపోతే కొంత కాలం క్రితం నవీన్ పోలిశెట్టి "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" అనే సినిమాలో హీరో గా నటించాడు. మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించగా ... యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు ఈ మూవీ ని నిర్మించారు. వరుస విజయాలతో మంచి జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ యువ నటుడి కి తాజాగా బైక్ యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది.

 అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం అమెరికాలో ఉన్న నవీన్ బైక్ మీద రోడ్డుపై వెలుతుండగా స్కిడ్ అయ్యి పడిపోయినట్లు దానితో ఈయనకు చిన్న పాటిగా చేతికి ప్యాక్చర్ అయినట్లు తెలుస్తోంది. దానితో వెంటనే నవీన్ ను చికిత్స కోసం ఆసుపత్రి కి తరలించగా ఈయనను పరిశీలించిన వైద్యులు ఏమి పర్వాలేదు కాకపోతే రెండు నెలలు మాత్రం రెస్ట్ తీసుకోవాలి అని సూచించినట్లు తెలుస్తోంది. ఇకపోతే నవీన్ రోడ్డు ప్రమాదం పై ఆయన టీం స్పందించాల్సి ఉంది. ఇకపోతే ప్రస్తుతం కూడా నవీన్ చేతిలో అనేక క్రేజీ సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: