ఈ నగరానికి ఏమైంది మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయినటువంటి అభినవ్ గోమఠం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ లో తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో , నటన తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈయన ఆ తర్వాత అనేక తెలుగు సినిమాలలో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు "మస్తు షేడ్స్ ఉన్నాయిరా" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించాడు. వైశాలి రాజ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ని కాసుల క్రియేటివ్ వర్క్స్ పతాకపం పై తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వంలో భవాని కాసుల , ఆరెమ్ రెడ్డి , ప్రశాంత్.వి ఈ మూవీ ని నిర్మించారు. ఈ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా ఫిబ్రవరి 23 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే విడుదల అయిన తర్వాత కూడా ఈ సినిమా ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ ను తెచ్చుకోలేకపోయింది.
దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్ లను రాబట్టలేదు. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను మార్చి 29 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు.