"నిఖిల్" బ్లాక్ బస్టర్ మూవీ కి సీక్వెల్..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన యువ నటులలో నిఖిల్ ఒకరు. ఈయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన హ్యాపీ డేస్ అనే మూవీ తో సూపర్ క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఈయనకు అనేక తెలుగు సినిమాలలో అవకాశాలు వచ్చాయి. కాకపోతే ఈయన నటించిన ఏ సినిమా కూడా నిఖిల్ కు హ్యాపీ డేస్ రేంజ్ గుర్తింపును తెచ్చి పెట్టలేదు. అలా చాలా సంవత్సరాల పాటు వరస అపజయాలతో కెరియర్ ను సాగించిన నిఖిల్ ... సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన స్వామి రారా అనే సినిమాలో హీరో గా నటించాడు.

స్వాతి రెడ్డి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. అప్పటి వరకు వరుస అపజయాలతో ఉన్న నిఖిల్ హీరో గా రూపొందిన సినిమా కావడం ... సుదీర్ వర్మ ఈ సినిమాతోనే దర్శకుడి గా ఎంట్రీ ఇవ్వనుండడంతో ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ పై ప్రేక్షకులు పెద్దగా ఎలాంటి అంచనాలు పెట్టుకోలేదు. కానీ ఈ సినిమా విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుండి అద్భుతమైన మౌత్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి రోజు రోజుకు కలెక్షన్ పెరిగి అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకుంది.

ఇకపోతే ఈ మూవీ కి సీక్వెల్ ను రూపొందించే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటితో ఈ మూవీ విడుదల అయ్యి 11 సంవత్సరాలు అయితుంది. ఈ సందర్భంగా నిఖిల్ తన సోషల్ మీడియా వేదికలో "స్వామి రారా" మూవీ కి సీక్వెల్ తీయాలని మీరు అనుకుంటున్నారా అంటూ స్వాతి ... సుధీర్ కు ట్యాగ్ చేశాడు. దానితో చాలా మంది అభిమానులు ఈ మూవీ కి సీక్వెల్ తీయండి బాగుంటుంది అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: