చీర కట్టులో ఫ్యామిలీ తో అయోధ్య రామమందిరాన్ని దర్శించిన ప్రియాంక...!!!
భర్త నిక్ తో కలిసి సాంప్రదాయ దుస్తుల్లో కనిపించింది ప్రియాంక చోప్రా. భర్త, కూతురుతో పాటు.. తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య రాముని దర్శనం చేసుకుంది. అయితే ప్రస్తుతం ఆమె అయోధ్య దర్శనం సమయంలో కట్టుకున్న చీర వైరల్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఆ చీరలో ప్రత్యకత ఏంటంటే.. ఆ చీర కాస్ట్.చాలా సింపుల్ గా ఉన్న ఏల్లో కలర్ శారీ.. ప్లెయిన్ గా చూడ్డానికి స్పెషల్ గా ఏమీ అనిపించలేదు. కాని కాస్ట్ తెలిస్తే మాత్రంషాక్ అయ్యేలా ఉంది ఇంతకీ ఆ చీర కాస్ట్ ఎంతో తెలుసా.. అక్షరాలా.. 63 వేల 800 రూపాయలు అని సమాచారం. పూర్తిగా ఆర్గానిక్ మెటీరియల్ తో ఈ చీరను తయారు చేశారని అందువల్లే ఈ చీర ఖరీదు చాలా ఎక్కువని సమాచారం అందుతోంది.ఈ చీర కోసం వాడిన రంగులు, ఫ్యాబ్రిక్ కూడా ఆర్గానిక్ కావడం గమనార్హం. ప్రియాంక చోప్రా హిందూ సాంప్రదాయం పాటిస్తూ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.ప్రియాంక చోప్రా ధరించిన చీరను పది రోజుల పాటు కష్టపడి తయారు చేశారని సమాచారం అందుతోంది.ప్రియాంక చోప్రా హిందూ సాంప్రదాయం పాటిస్తూ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రియాంక చోప్రాతో పాటు ఆమె భర్త, కూతురు సైతం బాలరాముడిని దర్శించుకోవడం విశేషం.