"ఓం భీమ్ బుష్" రన్ టైమ్ లాక్..?

Pulgam Srinivas
శ్రీ విష్ణు , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో రూపొందిన "ఓం భీమ్ బుష్" అనే సినిమా మార్చి 22 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డ్ నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది.

ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యూనిట్ సభ్యులు ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను 2 గంటల 15 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా సాధారణ నిడివి తోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను కూడా ఈ మూవీ బృందం అమ్మి వేసింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే గతంలో శ్రీ విష్ణు , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందిన బ్రోచేవారెవరురా మూవీ మంచి విజయం అందుకుంది. దానితో వీరి కంబోలో రూపొందిన రెండవ సినిమా కావడంతో ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sv

సంబంధిత వార్తలు: