'దేవర'లో సెకండ్ హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది.. తారక్ తో ఆ హాట్ బ్యూటీ రొమాన్స్?
కాగా ఈ సినిమాలో అతిలోకసుందరి దివంగత నటి శ్రీదేవి కూతురు హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఇదే జాన్వి కపూర్ కి మొదటి సినిమా కావడం గమనార్హం. అయితే తారక్, జాన్వి కపూర్ జోడిని తెరపై చూసేందుకు అటు నందమూరి అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్, శ్రీదేవి మ్యాజిక్ ని ఇప్పుడు తారక్, జాన్వి కపూర్ రిపీట్ చేస్తారని అనుకుంటున్నారు. అయితే ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ కూడా ఉంది అంటూ గత కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సెకండ్ హీరోయిన్ పాత్రకు ఇక ఈమెనే సెలెక్ట్ చేశారు అంటూ కొన్ని పేర్లు కూడా తెరమీదకి వచ్చాయి.
అయితే ఇక ఇప్పుడు దేవర మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనే విషయంపై ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఏకంగా ఎన్టీఆర్ సరసన మమిత బైజు నటించే ఛాన్స్ ఉందట. దేవర మూవీలో మమిత బైజు సెకండ్ హీరోయిన్గా నటిస్తుందట. అయితే దేవర మూవీ కేవలం ఒక పార్ట్ మాత్రమే కాదు రెండు పార్ట్ లు అన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఈ క్రమంలోనే జాన్వి ఈ సినిమాలో చనిపోతుందట. ఇక పార్టీలో మమిత బైజు ఇక మెయిన్ హీరోయిన్ గా సినిమాలోకి ఎంట్రీ అవుతుందట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.