మహేశ్ బాబు, రాజమౌళి సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి..!?

Anilkumar
సినీ సెలబ్రిటీ లు రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి. సమంతా నాగచైతన్య ఇద్దరు విడాకులు తీసుకుంటారు అని చెప్పి అప్పట్లో సంచలనాన్ని సృష్టించాడు ఆయన. వేణు స్వామి చెప్పినట్లుగానే ఆయన చెప్పిన కొంతకాలానికి వీరిద్దరు విడాకులు తీసుకునీ విడిపోయారు. ఆ తర్వాత మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకుంటారు అని ఆయన చెప్పినట్లుగానే నిహారిక సైతం విడాకులు తీసుకుంది. రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా ఫ్లాప్ అవుతుంది అని ముందుగానే

సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ విషయంలో కూడా ఆయన చెప్పిందే జరిగింది. ఇలా సినీ సెలబ్రిటీల జీవితాల్లో జరిగే విషయాలను ముందుగానే చెప్పి బాగా ఫేమస్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో ఆయనకి ఒక రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అలా టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు రష్మిక నిధి అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్లు సైతం ఆయన దగ్గర జాతక దోష నివారణకు సంబంధించిన పూజలను చేయించారు. వారికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సైతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా వేణు స్వామి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్దమవుతున్నారు. దీనిపై వేణు స్వామి మాట్లాడుతూ..మహేష్‌కు అంత స్టామినా లేదని తేల్చేశారు. రాజమౌళి-మహేష్ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా బడ్జెట్ 1000 కోట్లు అంటున్నారని..అయితే మహేష్ బాబు మీద అంత బడ్జెట్ వ్యర్థమని వేణు స్యామి తెలిపారు. మహేష్ బాబుకు అంత మార్కెట్ లేదని.. టికెట్లు రేట్లు పెంచిన ఆయన సినిమాలు 100 కోట్లు కలెక్ట్ చేయడానికి నానా తంటాలు పడుతున్న పరిస్థితి నెలకొందని వేణు స్వామి తెలిపారు. అయితే రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఉండటం మహేష్‌కు కలిసి వచ్చే అంశంగా వేణు స్వామి పేర్కొన్నారు. మహేష్ బాబు స్థాయిని తక్కువ చేస్తూ వేణు స్వామి మాట్లాడటంపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: