మళ్లీ కలిసి నటించడానికి రెడీ అయిన రష్మిక, విజయ్ దేవరకొండ..!?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంత బావుంటుంది గనక. వాళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుండడంతో వారికి మరింత గుర్తింపు వస్తుంది. అయితే ఆ విషయంలో రష్మిక మందన విజయ్ దేవరకొండ జంట ముందు వరుసలో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అలా ఒకప్పుడు నాగార్జున టబు ల జంట ఇండస్ట్రీ లో ఎవర్ గ్రీన్ జోడిగా ఉండేది. ఇప్పుడు ఆ రేంజ్ లో విజయ్ దేవరకొండ రష్మిక జంట ఉంది అని అంటున్నారు వారి అభిమానులు. అయితే ఎంతో కాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని పెళ్లి కూడా

 చేసుకోబోతున్నారు అని తరచూ సోషల్ మీడియాలో వీరిద్దరికి సంబంధించిన పుకార్లు చాలానే వస్తాయి. కానీ అదంతా ఎప్పుడు కూడా పట్టించుకోరు ఈ జంట ఎప్పుడూ ఈ విషయంపై స్పందించరు. వీరిద్దరిపై ఎన్ని రకాల రూమర్స్ వచ్చినా కూడా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వీళ్ళిద్దరికీ సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఈ జంట మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు అన్న వార్త వైరల్ గా మారింది . విజయ్ దేవరకొండ తాజాగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఢమాల్ అంటూ తుస్సు

 అనే టాక్ దక్కించుకుంది .  ఆ తర్వాత ప్రతి విషయాన్ని ఆచుతూచి అడుగులు వేస్తున్నాడు విజయ్. కాగా రీసెంట్ గానే రాజావారు రాణి గారు ఫేమ్ రవి కిరణ్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. అయితే ఆ సినిమా కంటే ముందే టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుందట . ఇది ఫుల్ టు ఫుల్ క్లీన్ క్లాసిక్ లవ్ స్టోరీ గా తెరకేక బోతుందట . ఇది తెలుసుకున్న అభిమానులు ఓ రేంజ్ లో ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు . దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: