ఎట్టకేలకు తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చేసిన దేవర బ్యూటీ..!!
ఈ అమ్మడు ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. అలాగే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్గా ఉంటూ బోల్డ్ ఫొటోలతో రచ్చ చేస్తుంది. ఇక జాన్వీ కపూర్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె గత కొద్ది కాలంగా శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ అమ్మడు శిఖర్తో కలిసి ఎన్నోసార్లు కెమెరాకు చిక్కింది. దీంతో వీరిద్దరు నిజంగానే లవ్లో ఉన్నారని అంతా నమ్మేశారు. అయితే ఇటీవల శిఖర్తో తిరుపతికి కూడా వెళ్లింది.
దీంతో వీరిద్దరు అక్కడే పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఈ అమ్మడు స్పందించలేదు. ఈ క్రమంలోనే వీరిద్దరి ఫొటోను షేర్ చేసి ఓ నెటిజన్ జాన్వీ-శిఖర్ పెళ్లి తొందరలో తిరుపతిలో జరగనుందంటూ ఓ పోస్ట్ పెట్టాడు. అది కాస్త జాన్వీ కపూర్ కంట పడటంతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ''కుచ్ బీ'' అంటూ పోస్ట్కు రిప్లై ఇచ్చింది. దీంతో ఏదైనా రాసేస్తారా? అందులో ఎలాంటి నిజం లేదని చెప్పకనే చెప్పేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.