మలయాళ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనుష్క..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. దాదాపుగా తెలుగు స్టార్ హీరోల అందరి సరసన హీరోయిన్గా నటించిన అనుష్క ఇప్పటికే మూడు ఫిలింఫేర్ అవార్డులను రెండు నంది అవార్డులను రెండు సైమా అవార్డులను సైతం దక్కించుకుంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి

సినిమాతో హీరోయిన్గా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఇక ఈ సినిమాతో ఈ బ్యూటీ కి ఫ్యాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కింది. కాగా ఈ సినిమా తర్వాత చాలా కాలం సినిమాలకు దూరమైంది. మరి ఎందుకు సినిమాలకి బ్రేక్ ఇచ్చింది అన్న విషయం మాత్రం ఎప్పటి వరకు తెలియదు. ఇక సోషల్ మీడియాలో సైతం ఈ ముద్ద గుమ్మ అసలు యాక్టివ్ గా ఉండదు. తనకి సంబంధించిన ఎటువంటి అప్డేట్ల ను ఫాన్స్ తో పంచుకోదు. దీంతో అనుష్క అభిమానులు ఒకింత నిరాశ చెందుతున్నారు. ఆమె అధిక బరువుతో అనారోగ్యం పాలయ్యిందని..

అందుకే సినిమాలకు దూరంగా ఉంటూ కెమెరాలకు చిక్కకుండా తిరుగుతుంది అంటూ.. పలు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే గతేడాది నవీన్ పోలిశెట్టితో కలిసి.. మిస్ శెట్టి మిస్టర్ పోలీశెట్టి సినిమాతో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చింది. ఇక తాజాగా మరో మలయాళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.  కథనార్ ది వైల్డ్ సోర్సరర్ అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు రాజీన్ థామస్ దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు అనుష్క రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారు అనే అంశం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: