మరో కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్.. హీరో ఎవరంటే..!?

Anilkumar
టాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ సినిమాలపరంగా ఇప్పుడు తన రూటు మార్చింది. గ్లామర్ విషయాల్లో హద్దు దాటేసింది ఈ బ్యూటీ. రౌడీ బాయ్స్ సినిమాతో అభిమానులకు షాక్ ఇచింది. ప్రస్తుతం తన తదుపరి సినిమాతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో సైతం రచ్చ చేస్తుంది. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ సరసన టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తోంది. కాగా ఇందులో పూర్తిగా తన గ్లామర్ డోస్  చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు టీజర్ చూసి ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు

అసలు ఈ సినిమాలో ఉంది అనుపమనే నా అని షాక్ అవుతున్నారు. అయితే ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఒక సినిమా చేస్తోంది. డైరెక్టర్ మారి సెల్వరాజ్ దర్శకత్వంలో స్పోర్ట్స్ బాక్డ్రొప్ లో వస్తున్న ఈ సినిమాలో విక్రమ్ చియాన్ కొడుకు ధృవ్ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ క్రమంలోనే అనుపమ పరమేశ్వరన్ తన తదుపరి సినిమాతో బిజీగా ఉంది అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. బండి డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగులతో అనుపమ ఓ చేయనున్నారు.

ఇటీవలే ఈ కు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. అయితే ఈ కు పరదా అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. ఆనంద్ మీడియా బ్యానర్ పై విజయ్ డొంకాడ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ తో పాటు సంగీత దర్శన రాజేంద్ర వంటి వారు కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ కి తెలుగులో వరుస అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అలా ప్రస్తుతం అనుపమ పరమేశ్వరానికి సంబంధించిన ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: