నెట్టింటా వైరల్ అవుతున్న ఛార్మి ఎమోషనల్ పోస్ట్..!!

murali krishna
టాలీవుడ్ న‌టి ఛార్మీ పేరు తెలియ‌ని వారుండ‌రు. ఒక‌ప్పుడు తెలుగులో అగ్ర‌స్టార్ హీరోలంద‌రితో న‌టించి మెప్పించింది. ఇప్పుడు నిర్మాత‌గా మారింది. ఈ మ‌ధ్య సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంది ఛార్మీ. ఈ న‌టి ప్రస్తుతం తన ఇంటి సభ్యుడ్ని కోల్పోయింది. తన అంకుల్‌ను కోల్పోవడంపై ఛార్మీ ఎమోషనల్ పోస్ట్ వేశారు. ఈ పోస్ట్ కాస్త సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతోంది. అంత స్ట్రాంగ్‌గా ఉండే వ్యక్తి ఇలా సడెన్‌గా చనిపోవ‌డంతో ఒకింత ఆశ్చర్యకరంగానూ ఉందని, గుండె బద్దలైనట్టుగా అనిపిస్తోందంటూ ఛార్మీ ఎమోషనల్ పోస్ట్ చేశారు. త‌న అంకుల్‌తో ఛార్మీకి ఉన్న బంధం తెలిపేలా ఓ ఫోటోను కూడా ఆమె అభిమానుల‌తో పంచుకున్నారు. ఇక ఆయన మీద త‌న‌కున్న ప్రేమను చాటేలా వేసిన పోస్ట్ కాస్త ఇప్ప‌డు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఛార్మీ షేర్ చేసిన పోస్టులో ఇలా రాసి ఉంది. కక్కి అంకుల్ ఎంతో స్ట్రాంగ్‌గా ఉంటారు. అలాంటి వారు ఇలా సడెన్‌గా మరణించారని తెలిసి షాక్ అయ్యాను. నా గుండె బద్దలైనట్టుగా అనిపిస్తోంది. అసలు జీవితం అనేది ఊహకు అందదు. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం. పింకీ పిన్నీ, స్వీడెల్, నైసీ, కెన్నీ మీరంతా స్ట్రాంగ్‌గా ఉండండి. మీకోసం నేను ఆ దేవుడ్ని ప్రార్థిస్తూ ఉంటాను.. అంటూ న‌టి ఛార్మీ ఎమోషనల్ అయ్యారు.ఛార్మీ ప్రస్తుతం సినిమా షూటింగ్ పనుల్లోనే బిజీగా ఉన్నారు. గ‌తంలో ఛార్మీ, పూరీ కాంబీనేష‌న్‌లో వ‌చ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ మంచి విజ‌యాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఛార్మీ డబుల్ ఇస్మార్ట్ సినిమాను పూర్తి చేసే పనిలో బిజిగా ఉన్నారు. లైగర్ సినిమాతో ప‌రాజ‌యాన్ని పొందిన సంగ‌తి తెలిసిందే. మరి ఈ ఇస్మార్ట్ సినిమా అయిన హిట్ అవుతుందో లేదో వేచిచూడాల్సిందే. రాబోయే ఈ సినిమాతో పూరి, ఛార్మీ కమ్ బ్యాక్ ఇస్తారా? లేదా? అన్నది మ‌రికొద్ది రోజుల్లోనే తెలీపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: