చేయి కట్ చేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. షోలో అందరూ షాక్?

praveen
ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించేది. కానీ ఇటీవలే కాలంలో సినిమాలకు మించి ఎంటర్టైన్మెంట్ పంచేందుకు అటు ఎన్నో టీవీ ఛానల్స్ వాళ్ళు రకరకాల షోలని ప్రసారం చేస్తూ ఉన్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు బుల్లితరపై అయితే కామెడీ షోలకు కొదవ లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు కొత్త కామెడీ షోలు పుట్టుకొస్తూనే ఉన్నాయని చెప్పాలి. ఇప్పటికే అటు ఈటీవీలో జబర్దస్త్ అనే కార్యక్రమం ప్రతివారం ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే దీనికి తోడు అటు శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కొత్త కార్యక్రమం కూడా ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే.

 జబర్దస్త్ షో తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ అంతటి ప్రేక్షకాదరనను పొంది టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంటూ ఉంది. అయితే ఇక ప్రతి వారం కూడా సరికొత్త కాన్సెప్ట్ తో ఇక ఈ షోలో ప్రేక్షకులను అలరించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కాగా ఇటీవల ఈ షో కి సంబంధించి ఒక ప్రోమో విడుదలైంది. ఈ మధ్యకాలంలో ఈటీవీ షోలలో శ్రీవిద్య తన కామెడీతో తెగ హాట్ టాపిక్ మారిపోతుంది. అయితే ఇటీవల అందరికీ షాక్ ఇచ్చింది. ఏకంగా తన ప్రియుడి గురించి చెప్పింది. శ్రీదేవి డ్రామా కంపెనీలో తనతో పాటు చేసే మరో కమెడియన్ ను ఇష్టపడుతున్నట్లు చెప్పుకొచ్చింది.

 ఈ మధ్యకాలంలో అతను తనతో ఎక్కువగా మాట్లాడటం లేదని పట్టించుకోవట్లేదు అని కనీసం ఫోన్లు చేస్తున్న కూడా లిఫ్ట్ చేయట్లేదు అంటూ తెగ ఫీల్ అయిపోయింది శ్రీ విద్య. ఈ క్రమంలోనే అతనిపై ఉన్న ప్రేమను ఎలా చూపించాలో తెలియక బాధను దిగమింగులుకోలేక చివరికి చెయ్ కట్ చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది. అలా చేయడం వల్ల తన చేతికి ఏకంగా గాయమైందని ఆరుకుట్ల కూడా పడ్డాయి అంటూ చెప్పుకొచ్చింది  అయితే శ్రీవిద్య తన చేతికి గాయమైందని మాత్రమే చెప్పగా.. కమెడియన్ హైపర్ ఆది అసలు విషయాని చెప్పుకోచ్చాడు. కమెడియన్ బాబు కోసమే శ్రీవిద్య ఇలా చేయి కట్ చేస్తుందని చెప్పడంతో అక్కడున్న వారందరూ కూడా షాక్ అయ్యారు. దీంతో అక్కడున్న రష్మీ చేతులు కట్ చేసుకోవడం ఏంటి పిచ్చి కాకపోతే ఇలాంటి పనులు అసలు చేయకూడదు అంటూ వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Etv

సంబంధిత వార్తలు: