పూర్తిగా మారిపోయిన రాశిఖన్నా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్..!

Anilkumar
టాలీవుడ్ ప్రేక్షకులకు రాశి ఖన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఊహలు గుసగుసలాడే సినిమాతో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయం అయింది ఈ ముద్ద గుమ్మ. బొద్దుగా కనిపించి తన నటనతో అందరినీ ఫిదా చేసింది. మొదటి సినిమాతోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తుండిపోయింది. ఆ తరువాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అలా వరుస ఆఫర్లు అందుకున్న ఈ బ్యూటీకి స్టార్ హీరోయిన్ అన్న పేరు మాత్రం ఇప్పటికీ రాలేదు. గత కొద్ది కాలంగా ఈ బ్యూటీ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ అసలు కనిపించడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు వస్తున్నాయి. హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రా జోడిగా యోధా లో నటిస్తుంది. త్వరలోనే ఈ విడుదల కానుంది. దీంతో అటు యోధా ప్రమోషన్లలో తెగ బిజీ అయిపోయింది రాశి. అయితే ఈలో కంటే ఎక్కువగా ప్రమోషన్లలోనే సిద్ధార్థ్ తో ఎక్కువగా క్లోజ్ గా మూవ్ అవుతుంది రాశీ. దీంతో కియారా అద్వానీ ఫ్యాన్స్ రాశీపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్స్ చేస్తూ మండిపడ్డారు. అయితే దీనిపై ఇప్పటివరకు రాశి స్పందించలేదు.


ఇదిలా ఉంటే.. తాజాగా రాశీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. బ్యూటీ లేటేస్ట్ లుక్స్ చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్. బ్లూ కలర్ డ్రెస్ లో హోయలు పోతూ కిల్లర్ చూపులతో ఇచ్చిన ఫోజులు వైరలవుతున్నాయి. బ్లూ డ్రెస్ లో బార్పీ బొమ్మలా రెడీ అయ్యింది రాశీ.. ఒకప్పుడు బొద్దుగా ముద్దుగా కనిపించిన రాశీ ఇప్పుడు మాత్రం బక్కచిక్కిపోయి నాజూకైన అందంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో పాగా వేయడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: