ప్రభాస్ తో సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ..!?

Anilkumar
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇటీవల యానిమల్ మూవీతో ఎంతలా పాపులారిటీ దక్కించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా విషయంలో ఎక్కువగా సందీప్ విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో ‘స్పిరట్’ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. షూటింగ్ మొదలవ్వకపోయినా టైటిల్‌ను మాత్రం ప్రకటించారు. ఇక ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. కానీ సోషల్ మీడియాలో

మాత్రం దీనికి సంబంధించిన పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. యానిమల్ సక్సెస్ తో జోరు మీదున్న సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ మూవీకి సిద్ధం అవుతున్నాడు.  కాగా చాలా కాలం క్రితమే ప్రభాస్ హీరోగా స్పిరిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ పై ఆయన లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. సందీప్ రెడ్డి వంగ తిరుమలకు వచ్చారు. తలనీలాలు ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మీ తదుపరి చిత్రం ఏమిటనగా... స్పిరిట్ అని సమాధానం చెప్పారు.  ప్రస్తుతం ప్రభాస్ కల్కి

2829 AD , రాజా సాబ్ చిత్రాలు చేస్తున్నారు. ఇవి రెండు చిత్రీకరణ దశలో ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న కల్కి మే 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే వాయిదా పడవచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్ భిన్నమైన కథ అని తెలుస్తుంది.  యానిమల్ కి సీక్వెల్ గా యానిమల్ పార్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికంటే ముందు ప్రభాస్ తో స్పిరిట్ చేస్తున్నట్లు సందీప్ రెడ్డి లేటెస్ట్ కామెంట్స్ తో అర్థం అయ్యింది. ఇక స్పిరిట్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ అని సందీప్ రెడ్డి వంగ గతంలో చెప్పాడు. దీంతో ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: