వాటి గురించి తెలుసుకునేందుకు నాకు చాలా టైం పట్టిందంటున్న అనన్య..!!

murali krishna
మల్లేషం' సినిమా తో సినీ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి నప్పటికీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంతో టాలీవుడ్‌ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అన్య నాగళ్ల.ఈ సినిమా లో కీలక పాత్ర లో నటించి.. తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. తర్వాత అనన్య వరుస అవకాశాలు దక్కించుకుంది. అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయిన ఈ అమ్మడు నటనకు మాత్రం మంచి మార్కులు దక్కాయి. రీసెంట్ గా అనన్య నటించిన హార్రర్ చిత్రం 'తంత్ర' ట్రైలర్ విడు దలైంది. ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్‌ కు భారీ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇప్పటి వరకు అనన్య ఎక్కువగా బోల్డ్ సీన్స్‌ లో కనిపించింది లేదు. పొట్టేలు ట్రైలర్ లో మాత్రం కిస్ సన్నివేశంలో కనిపించి ఫ్యాన్స్ కు ఒక్కసారిగా షాకిచ్చింది. అంతేకాకుండా గ్లామర్ గేట్లు ఎత్తేసి మరీ బోల్డ్ సన్నివేశాల్లో రెచ్చిపోయిందని నెట్టింట టాక్ వినిపిస్తోంది.
అయితే తాజాగా తాజాగా హాజరైన ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ సీన్లపై ప్రశ్న ఎదురైంది. పొట్టేలు లో మాదిరిగానే 'తంత్ర' లోనూ ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్ ఉంటాయా? అని అడగ్గా.. అనన్య ఇలా బదులిచ్చింది.. ''ప్రతి ఆరు నెలలకు మనిషి ఆలోచనల్లో మార్పులు వస్తుంటాయి. నేను ఇండస్ట్రీ కి వచ్చిన స్టార్టింట్‌ లో కేవలం పద్ధతి గల రోల్స్ లోనే నటి ద్దామని అనుకున్నాను. కానీ ఇవన్నీ నటనలో భాగమే. ఇవన్నీ పర్ఫామెన్స్‌ లో భాగమే అని తెలుసు కునేందుకు నాకు చాలా టైం పట్టింది. అంటూ అనన్య నాగళ్ల చెప్పుకొచ్చింది. కథకు అవసరమైతే బోల్డ్ సీన్స్ లో నటిస్తానని, తంత్ర సినిమాలో రొమాంటిక్, బోల్డ్ సీన్స్ ఉన్నాయని ఈ హీరోయిన్ చెప్పకనే చెప్పిందంటూ నెట్టింట నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అనన్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: