అందుకే యానిమల్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేయలేదు.. రష్మిక మందన..!?

Anilkumar
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగ, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కిన బోల్డ్ వైల్డ్ యాక్షన్ మూవీ యానిమల్. ఈ సినిమాలో రష్మిక మెయిన్ హీరోయిన్ గా నటించగా తృప్తి దిమ్రీ సెకండ్ హీరోయిన్ గా చేశారు. ఇది పక్కన పెడితే, యానిమల్ మూవీలో మెయిన్ హీరోయిన్ రష్మిక అయినప్పటికీ.. ఆడియన్స్ లో సెకండ్ హీరోయిన్ అయినా తృప్తి దిమ్రీకి ఎక్కువ క్రేజ్ వస్తుంది. రణబీర్, తృప్తి మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. దీంతో తృప్తికి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. ఆల్రెడీ కొన్ని సినిమా ఆఫర్స్ కూడా తృప్తి వద్దకు చేరాయట. 

వీటిలో టాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. యానిమల్ మూవీ వరల్డ్ వైడ్ రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రన్బీర్ కపూర్ కెరీర్ హైయెస్ట్ నమోదు అయ్యాయి. అయితే యానిమల్ సక్సెస్ మీట్స్, ఇంటర్వ్యూల్లో రష్మిక మందాన పెద్దగా కనిపించలేదు. అందుకు కారణం ఏమిటో తాజాగా వెల్లడించింది. యానిమల్ విడుదల తర్వాత నేను షూటింగ్ లో బిజీ అయ్యాను. ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ సెట్స్ పై ఉన్నాయి. వాటి షూటింగ్ కోసం నేను రాత్రిళ్ళు ప్రయాణం చేయాల్సి వచ్చింది. అందుకే యానిమల్ సక్సెస్ కి సంబంధించిన ఇంటర్వ్యూలు,

ఈవెంట్స్ లో నేను పాల్గొనలేకపోయాను. నాకు కూడా యానిమల్ సక్సెస్ ని ఆస్వాదించాలని అనిపించింది. కానీ కుదర్లేదు.  నాపై ప్రేమాభిమానాలతో మీరు ఆందోళన చెందారు. నాకు అర్థం అవుతుంది. అప్ కమింగ్ చిత్రాలతో ఆ లోటు తీరుస్తాను... అని రష్మిక మందాన చెప్పుకొచ్చింది. ఇక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లిగా అదరగొట్టింది. రీసెంట్‌గా సంక్రాంతి బరిలో విజయ్ హీరోగా నటించిన ‘వారిసు’ మూవీతో తమిళ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా తెలుగులో ‘వారసుడు’ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: