టాలెంట్ను బట్టి క్యారెక్టర్ ఇస్తే బాగుంటుంది అంటున్న ప్రభాస్ హీరోయిన్..!!!
కట్ చేస్తే ప్రభాస్ తో రాఘవేంద్ర సినిమా ఆఫర్ వచ్చింది. అదే ఫ్లోలో మిస్సమ్మ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మాయమైపోయింది. తను తెలుగులో నటించిన రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్గానే ఛాన్స్ లు వచ్చాయి.అంతేకాకుండా ఆ రెండు సినిమాల్లోనూ తన క్యారెక్టర్ చనిపోతుంది. దాంతో తనకు వచ్చిన అవకాశాలన్ని ఇలాంటి పాత్రలే రావడంతో విసిగిపోయానని, ఒకే తరహా పాత్రల్లో నటించడం కంటే ఖాళీగా ఉన్నది బెటర్ అనిపించి ఇండస్ట్రీని వదిలేసి వెళ్లానని మన్మథుడు హీరోయిన్ చెప్పుకొచ్చింది. ఒక క్యారెక్టర్ బాగా చేశారని ఆ నటులను ఆ ఒక్క క్యారెక్టర్కే పరిమితం చేయడం కరెక్ట్ కాదని ఈ బ్యూటీ తెలిపింది. అంతేకాకుండా ఇప్పటికైనా ఇండస్ట్రీలో టాలెంట్ను బట్టి క్యారెక్టర్ ఇస్తే బాగుంటుందని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు సూచించింది.
ఈ బ్యూటీ రాఘవేంద్ర సినిమా టైంలోనే సచిన్ సగ్గర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని కొత్త జీవితం స్టార్ట్ చేసింది. ఇప్పుడు వీరిద్దరికి ఒక కూతురు కూడా ఉంది. ఇప్పటికీ అదే వన్నె తరగని అందంతో.. రెండు దశాబ్దాల కిందట ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అలానే ఉందని పలువరు నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు.