సిద్ధార్థ తో సీక్రెట్ నిశ్చితార్థం పై క్లారిటీ ఇచ్చిన అదితి రావ్..!

murali krishna
కోలీవుడ్ హీరో సిద్దార్థ్,హీరోయిన్ అదితి రావ్ హైదరీ రిలేషన్ లో వున్న విషయం తెలిసిందే.వీరిద్దరూ “ఆర్ ఎక్స్100” దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన మహాసముద్రం మూవీలో కలిసి నటించారు.ఈ సినిమాతోనే వీరిద్దరి పరిచయం ప్రేమగా మారినట్లు సమాచారం.అప్పటి నుంచి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇరుకుటుంబాల అంగీకారంతో మార్చి 27న వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్‌ రంగనాథ స్వామి దేవాలయంలో వీళ్లిద్దరూ ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. దీనిపై అదితి స్పందించారు. నిశ్చితార్థం విషయం బయట పెట్టడానికి కారణం చెప్పారు. తన తల్లి కోరికమేరకు నిశ్చితార్థం జరిగినట్లు పోస్ట్‌ పెట్టానని అన్నారు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో ఈ వేడుక జరుగగా..ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితులు ఈ నిశ్చితార్థంకు హాజరయ్యారు. అయితే వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో నటి అదితి రావు హైదరి కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. దీంతో పురోహితులు దగ్గరుండి ఈ వేడుక జరిపించారు. అయితే నిశ్చితార్థంపై ఇప్పటివరకు అదితి రావు హైదరీ ఎటువంటి ప్రకటన చేయకపోవడం విశేషం. ఇదిలావుంటే తాజాగా ఈ నిశ్చితార్థంపై అదితి రావ్ ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.
తన తల్లి కోరిక మేరకు నాకు నిశ్చితార్థం అయినట్లు బహిరంగంగా ప్రకటించినట్లు అదితి వెల్లడించారు. నా ఎంగేజ్‌మెంట్ అయిన రోజు చాలా మంది మా అమ్మకు కాల్ చేసి నిజంగానే అదితి పెళ్లి చేసుకోబోతుందా అని మా పెళ్లి గురించి తెలుసుకోవాలని అనుకున్నారు. ఇక అమ్మ కూడా వారి బాధ చూడలేక.. దయచేసి ప్రజలకు చెప్పండి, నాకు నాన్‌స్టాప్ కాల్స్ వస్తున్నాయి అంటూ తెలిపింది. దీంతో నేను నేను, సిద్ధార్థ్‌ దీనిపై పోస్ట్‌లు పెట్టాం. నా నిశ్చితార్థం 400 ఏళ్ల నాటి గుడిలో చేసుకున్నాను. ఈ గుడితో మా ఫ్యామిలీకి నాకు ప్రత్యేక అనుబంధం ఉంది అంటూ చెప్పుకోచ్చింది.అలాగే ఇద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రాలేదు కానీ హిరామండి మూవీ ప్రమోషన్లలోనూ అదితి కనిపించకపోవడంతో.. అంతా పెళ్లి కోసమే వెళ్లిందని అనుకున్నారు.కానీ ఆ తర్వాత రోజే అదితి తన నిశ్చితార్థంకు సంబంధించిన ఫొటోను షేర్ చేసింది. అతడు ఓకే చెప్పాడంటూ హీరోయిన్, తను ఓకే చెప్పిందంటూ సిద్దార్థ్ లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. ఇలా అందరికీ క్లారిటీ ఇవ్వడానికి ఓ పెద్ద కారణమే ఉందని తాజాగా అదితి రావు హైదరి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ముఖ్యంగా తన అమ్మ కారణంగానే నిశ్చితార్థం ఫొటోలను నెట్టింట పెట్టాల్సి వచ్చిందని.. తమ పెళ్లి గురించి తెలుసుకోవాలని అనేక మంది తన తల్లికి ఫోన్ చేసినట్లు వివరించింది. రోజూ వచ్చే ఫోన్లకు ఆమె సమాధానం చెప్పలేక.. ప్లీజ్ ఇకనైనా మీ ఎంగేజ్ మెంట్ గురించి మీడియాకు చెప్పేయండి అని చెప్పినట్లు స్పష్టం చేసింది. తాజాగా ఆమె నటించిన హీరామండి సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: