బాలకృష్ణతో పూరీ.. మళ్లీ పైసా వసూల్ ట్రీట్..!

shami
నందమూరి బాలకృష్ణ పూరీ జగన్నాథ్ ఇద్దరు కలిసి చేసిన సినిమా పైసా వసూల్. పూరీ స్టైల్ ఆఫ్ టేకింగ్ లో బాలయ్య చేసిన ఆ సినిమా కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది. తన ప్రతి సినిమాలో హీరో పాత్రని చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసే పూరీ పైసా వసూల్ లో కూడా బాలకృష్ణ ని కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. డ్యాషింగ్ రోల్ లో పూరీ అదరగొట్టగా సినిమా నందమూరి ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమాలో సాంగ్స్ ప్రత్యేకంగా నిలిచాయి. ముఖ్యంగా అరె మామ ఎక్ పెగ్ లావో సాంగ్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో శ్రీయ హీరోయిన్ గా నటించింది. అయితే పైసా వసూల్ షూటింగ్ టైం లోనే బాలకృష్ణకు మరో కథ వినిపించాడట పూరీ జగన్నాథ్. ఆ సినిమా రిలీజ్ తర్వాతే ఆ ప్రాజెక్ట్ కూడా చేయాలని అనుకున్నారు కానీ కుదరలేదు.
పైసా వసూల్ కాంబో మళ్లీ కలిసి పనిచేస్తారని లేటెస్ట్ టాక్. పూరీ ప్రస్తుతం చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ షూటింగ్ పూర్తి కాగానే బాలయ్యతో సినిమా షురూ చేస్తాడని తెలుస్తుంది. బాలకృష్ణ పూరీ మళ్లీ కలిసి చేస్తే మాత్రం మరోసారి పైసా వసూల్ లాంటి సినిమా వస్తుందని చెప్పొచ్చు. ఈసారి బాలకృష్ణతో పూరీ మరో కొత్త స్టోరీ ట్రై చేస్తున్నాడని తెలుస్తుంది. పూరీ బాలకృష్ణ ఈ కాంబో రెండో సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. బాలకృష్ణ ప్రస్తుతం కె ఎస్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అఖండ 2 ఉంటుందని టాక్. సో బోయపాటి తర్వాత పూరీతో సినిమా చేస్తారేమో చూడాలి. పూరీ జగన్నాథ్ బాలకృష్ణ కాంబో మళ్లీ కలిసి సినిమా చేస్తే చూడాలని నందమూరి ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: