డబ్బులు ఇస్మార్ట్ కొత్త డేట్ వచ్చింది..!

shami
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ 2019లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ సినిమాతో ఇద్దరూ డాషింగ్ హిట్ అందుకోగా మళ్లీ ఇన్నాళ్లకు డబల్ ఇస్మార్ట్ అని వస్తున్నారు. పూరి జగన్నాథ్ సినిమాని భారీ బడ్జెట్లో తెరకెక్కిస్తున్నారు. డబల్ ఇస్మార్ట్ లో బాలీవుడ్ యాక్షన్ హీరో సంజయ్ దత్ కూడా విలన్ గా చేస్తున్నారని తెలిసింది. అందుకే ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేశారు పూరి.
సినిమా మొదలైనప్పుడే మార్చి 8న రిలీజ్ డేట్ లాక్ చేసిన పూరి అనుకున్న టైం కి సినిమాను పూర్తి చేయలేకపోయారు.  ఇక సినిమా సమ్మర్ రేసులో అయినా ఉంటుందేమోనని అనుకుంటే లేటెస్ట్ గా సినిమాని జూన్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రామ్ పూరి జగన్నాథల డబుల్ ఇస్మార్ట్ ఫైనల్ గా జూన్ 14న రిలీజ్ లాక్ చేశారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాని జూలై నా రిలీజ్ చేసిన పూరి డబుల్ ఇస్మార్ట్ ని జూన్లో రిలీజ్ ప్లాన్ చేశారు.
ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న సందర్భంగా యాక్షన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈమధ్య బాలీవుడ్ ఆడియన్స్ సౌత్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక్కడ మాస్ అండ్ కమర్షియల్ సినిమాలకు అక్కడ సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. వారిని టార్గెట్ చేస్తూనే డబల్  ఇస్మార్ట్ భారీ యాక్షన్ కట్టాలతో వస్తుంది. సినిమా కోసం రామ్ తన ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నట్టు తెలుస్తుంది. స్కంద అనుకున్న అంచనాలను అందుకోలేదు కాబట్టి డబల్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు రామ్. మరి పూరి రామ్ ఇస్మార్ట్ శంకర్ మ్యాజిక్ ని ఈ సినిమాతో కూడా రిపీట్ చేస్తారో లేదో చూడాలి. రామ్ ఫ్యాన్స్ మాత్రం డబల్ డిస్మార్ట్ మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: