అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న నేషనల్ క్రష్....!!

murali krishna
టాలీవుడ్.. బాలీవుడ్ లను ఒక ఊపు ఊపేస్తూ..నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్న. తాజాగా ఈబ్యూటీ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. రేర్ రికార్డ్ ను క్రియేట్ చేసింది.
రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. అటు బాలీవుడ్ ను.. ఇటు టాలీవుడ్ ను రెంటిని బ్యాలన్స్ చేస్తూ.. స్టార్ గా వెలుగు వెలుగుతోంది. పాన్ ఇండియా హీరోయిన్ గ రచ్చ చేస్తోంది. ఇక పుష్ప సినిమాతో సౌత్ లో.. యానిమల్ సినిమాతో నార్త్ లో ఊపు ఊపి వదిలిపెట్టింది పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది.ఇక ప్రస్తుతం పుష్ప2 తో పాన్ ఇండియా కాదు... పాన్ వరల్డ్ హీరోయిన్ గా మారబోతోంది రష్మిక. ఈసినిమా ఆస్కార్ రేంజ్ కు తీసుకెళ్ళే అవకాశం ఉంది. దాంతో ఇవన్నీ అనుకున్నవి అయితే.. రష్మిక రేంజ్ మారిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే నేషన్ క్రష్ గా ఉన్న రష్మిక ఆతరువాత ఇంటర్నేషనల్ క్రష్ గా మారినా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదు.ఇక ఈక్రమంలో.. రష్మికా ఎంతో క్రేజ్ తో పాటు.. తాజాగా అరుదైన గౌరవాన్ని కూడా అందుకుంది. వరల్డ్ టాప్ మ్యాగజైన్‌ ఫోర్బ్స్... ఇండియా వెర్షన్ లో రష్మిక.. ప్రత్యేక ఆర్టికల్ ప్రచురించబడింది. ఇంకా..ఇండియాలో ప్రస్తుతం టాప్ పొజిషన్ కి ఎదుగుతున్న యువ వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలలతో పాటు సినిమా స్టార్స్ ను కూడా కలుపుకుని.. స్టార్స్ కి సంబంధించి ఫోర్బ్స్ ఇండియా ప్రత్యేక ఆర్టికల్ ని ప్రచురించింది.
 ఇక ఈఆర్టికల్ లో సినిమా ఇండస్ట్రీ నుంచి రష్మిక మందన్నకు స్థానం దక్కింది. అంతే కాదు ఈ పేజ్ లో ప్లేస్ సాధించిన యంగ్ టాలెంట్స్ తో కలిసి కవర్ పేజీ పై స్టిల్ ఇచ్చింది రష్మిక మందన్న. అంతే కాదు వీరితో ఉన్న తన ఫోటోని రష్మిక.. ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్టు చూసిన నెటిజెన్స్, అభిమానులు.. రష్మిక అభినందనలు తెలియజేస్తున్నారు.అలాగే ఫోర్బ్స్ ఇండియా ఆ ఆర్టికల్ లో రష్మిక గురించి ఏం రాసి ఉంటారని ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక రష్మిక వరుస సినిమాలతో సందడి చేస్తోంది. అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో చాలా ప్రాజెక్ట్ లు ఆమె చేతిలో ఉన్నారు ప్రస్తుతం ప్రస్టేజియస్ ప్రాజెక్ట్.. అల్లు అర్జున్‌ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2లో నటిస్తుంది రష్మిక. ఈసినిమాతో భారీ టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నారు టీమ్.ఇక బాలీవుడ్ లో విక్కీ కౌశల్ తో చావ సినిమాలో నటిస్తోంది రష్మిక. ఈమూవీ కూడా పీరియాడిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. అలాగే అటు చాలా కాలం తరువాత తమిళంలో ధనుష్, శేఖర్ కముల కలయికలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తున్నారు. వీటితో పాటు రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్.. అనే రెండు లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తున్నారు రష్మిక మందన్నా. ఇవే కాదు యానిమల్ సీక్వెల్ తో పాటు.. ప్రభాస్ సరసన స్పిరిట్ లో కూడా ఈమెనే హీరోయిన్ అంటున్నారు. నిజం ఎంతో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: